జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Tuesday, January 4, 2011

చలికే వణుకుపుట్టింది * అర్ధరాత్రి దాటినా యువనేతకు అదే నీరాజనం

మండే ఎండ.. ముసుగేసిన మంచు.. వణికిస్తున్న చలి.. ఇవేవీ వారిని నిలువరించలేకపోయాయి. తమ జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడిని కనీసం ఆయన కుమారుడిలోనైనా చూసుకోవాలని వారంతా తహతహలాడారు. వణికిస్తున్న చలిని సైతం ఖాతరు చేయలేదు. సోమవారం అర్ధరాత్రి విశాఖ జిల్లాలో జగన్ చేసిన ఓదార్పు యాత్రకు అశేషంగా తరలివచ్చిన జనం తమ అభిమానాన్ని చాటుకున్నారు. చలిగాలులు బలంగా వీస్తున్న నేపథ్యంలో పొద్దుగుంకగానే గ్రామీణులు ముసుగుతన్నుతున్నారు. ఏడైతే గడప దాటడం లేదు. అలాంటిది రెండుగంటలకుపైగా జగన్ ఆలస్యంగా వచ్చినా ఆరుబయట మంచుగాలిలో నిరీక్షించారు.

సబ్బవరం జంక్షన్ చేరుకునేసరికే రాత్రి 11:40 గంటలయింది. అయినా చెక్కుచెదరని జనం. జగన్‌ను చూసిన సంతోషంలో అన్నీ మరచిపోయామని భూలోకయ్య అనే వృద్ధుడు చెప్పాడు. చలిగిలి ఏమీ అనిపించలేదన్నాడు. 12:45కు యువనేత బంగారం పాలెం చేరుకున్నారు. ఆరిపాక నుంచి లింగాల తిరుగుడు వరకూ ఆ చలిరాత్రిలో దారిపొడవునా యువనేతకు జనం జేజేలు పలికారు. ఒంటిగంటన్నరకు అడ్డూరు చేరుకున్నా జనాన్ని ఏ మంచూ.. చలిగాలీ అడ్డుకోలేకపోయాయి. తర్వాత ఆయన చౌడువాడ.. గొండుపాలెం మీదుగా 2:20 గంటలకు కోటపాడు చేరుకున్నారు. మరో గంటన్నరలో తెల్లారిపోతుందని పల్లెవాసులు భావిస్తారు. అలాంటి సమయంలో కూడా దుప్పట్లు కప్పుకున్న జనంతో రోడ్లన్నీ నిండిపోయి కనిపించాయి.

మధ్నాహ్నం నుంచి సభలు.. విగ్రహావిష్కరణలతో అలసిపోయినా యువనేత ఏమాత్రం ఆ భావన దరిచేరనీయకుండా వారందరినుద్దేశించి మాట్లాడారు. రాజన్న గురించి చెబుతున్నప్పుడు జనావళిలో ఉత్సాహం పెల్లుబుకింది. జిల్లాకు తొలిసారి వచ్చిన దివంగత నేత కుమారుడితో చేయి కలపాలని వయోభేదం లేకుండా పోటీ పడ్డారు. అవకాశమున్నంతవరకూ ఆయనకూడా వారితో కరచాలనం చేశారు. మొత్తం మీద ఓదార్పుయాత్ర బాటలో చలిపులి పలాయనం చిత్తగిస్తోంది.. జగన్‌పై జనం కురిపిస్తున్న ప్రేమలో మంచు కరిగిపోతోంది.

జగన్‌ను కలిసిన నేతలు
విశాఖ జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రకు సంఘీభావం తెలిపేందుకు మంగళవారం పలువురు నేతలు వచ్చారు. ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబూరావు, ఆళ్ల నాని, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర్, సీనియర్ నేతలు గోనె ప్రకాశ్‌రావు, బాజిరెడ్డి గోవర్ధన్, సినీ నటుడు విజయ్‌చందర్ తదితరులు యాత్రలో పాల్గొన్నారు. ఓదార్పులో జగన్ వెంట ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యేలు నరేష్‌కుమార్ అగర్వాల్ (లల్లూ-ఇచ్ఛాపురం), గండి బాబ్జీ, పూడి మంగపతిరావు, మిలట్రీ నాయుడు, చిర్ల జగ్గారావు, మాజీ మంత్రి జి.మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి జక్కంపూడి రాంమోహన్‌రావు కుమారుడు రాజా, జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి విజయాదేవి, ఏపీటీఎస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్‌రెడ్డి, వరంగల్ జిల్లా జగన్ యువసేన అధ్యక్షుడు బి.సుధీర్‌రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా జగన్ యువసేన అధ్యక్షుడు తాడి విజయ్ భాస్కరరెడ్డి, వైఎస్సార్ ట్రస్టు రాష్ట్ర ఇన్‌చార్జి ఎస్.సత్యనారాయణ, జగన్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటరెడ్డి తదితరులు జగన్‌ను కలిశారు.

ఓదార్పుకు ‘తూర్పు’ సంఘీభావం 
జగన్ విశాఖ జిల్లాలో నిర్వహిస్తున్న ఓదార్పు యాత్రకు తూర్పు గోదావరి జిల్లా నుంచి మంగళవారం పెద్ద ఎత్తున నేతలు తరలివెళ్లారు. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, వివిధ పార్టీల నాయకులు అన్నవరం చేరుకున్నారు. అక్కడ కొంత దూరం పాదయాత్ర చేశారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో కొబ్బరి కాయలు కొట్టారు. అనంతరం ర్యాలీగా విశాఖకు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు.

మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, తోట గోపాలకృష్ణ, కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావు, జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వరుపుల రాజా, రాష్ట్ర జెడ్పీటీసీ సభ్యుల అసోసియేషన్ అధ్యక్షుడు పడాల రామారెడ్డి, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్‌లు రెడ్డి ప్రసాద్, బైర్రాజు ప్రసాదరాజు, మిండగుదిటి మోహన్, మహిళా నేత కొల్లి నిర్మలాకుమారి, రాజమండ్రి నగర పాలక సంస్థ మాజీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ రాఘవబాబు, ఎంపీపీలు గుత్తుల సాయి, నున్న రామచంద్రరావు, చిరంజీవిరాజు, చిట్టిరాజు, గుబ్బల వెంకటేశ్వరరావు, సిరిపురపు శ్రీనివాసరావు, వివిధ పార్టీల నాయకులు టి.కె.విశ్వేశ్వరరెడ్డి, పి.కె.రావు, మానేపల్లి సురేష్, మోకా ఆనందసాగర్, మట్టా శైలజ, కర్రి పాపారాయుడు తదితరులు విశాఖ జిల్లా చోడవరం సమీపాన లక్కవరం గ్రామంలో యువనేతను కలిశారు.

జగన్ జిల్లా నేతలను ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ తూర్పు గోదావరి జిల్లా ఓదార్పు యాత్ర సందర్భంగా మీరు చూపించిన అభిమానాన్ని ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నాను. విశాఖకు కూడా వెన్నుదన్నుగా నిలిచిన మీకు, మీ జిల్లాకు రుణపడి ఉంటాను’ అని అన్నారు.

No comments:

Post a Comment