
ఇదెక్కడి న్యాయమని అడిగే నాథుడే లేడా?
వరదలో మునిగేది మనం.. మిగులు జలాలు వాళ్లకా?
65 శాతమే నీటి లభ్యతను తీసుకున్నా అడిగేవారేరీ?
పైన 100 టీఎంసీలు జలవిద్యుత్తుకు వాడుకుని సముద్రానికి మళ్లిస్తారా?
మనం రైలు అడిగితే బీహార్కో, బెంగాల్కో ఇస్తారు..
వ్యవసాయంలో నష్టం జరిగిందంటే ఆ శాఖ మంత్రి దగ్గరికి వెళ్లాలి... ఆయనేమో వేరే రాష్ట్రానికి చెందినవారు.. మనకు ప్రాధాన్యత ఇవ్వరు..

రాష్ట్రంపై వివక్ష ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఎంపీలను మనమివ్వాలి.. ప్రగతి మాత్రం వేరే రాష్ట్రాలకా? అంటూ దుయ్యబట్టారు. విశాఖ జిల్లాలో ఆరో రోజు ఓదార్పు యాత్రలో భాగంగా శనివారం రాత్రి కోటవురట్లలో పెద్ద ఎత్తున తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ‘ఒక పక్క దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల సువర్ణ పాలన చూశాం. ఆ తరువాత వైఎస్ రెండోసారి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించాక వంద రోజుల్లోనే మన మధ్య నుంచి వెళ్లిపోయారు. ఆయన లేని ఈ సమయంలో ఏం జరుగుతోందో ఒక్కసారి చూడండి. రెండేళ్లు కావస్తోంది. ఒక్క కొత్త రేషన్ కార్డూ ఇవ్వరు. ఒక్క కొత్త ఇల్లూ ఇవ్వరు. ఒక్క కొత్త పెన్షనూ ఇవ్వరు. అటువైపు చూస్తే పోలవరం ఆగిపోయింది. ఇటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి ఆలోచించిన నాథుడే లేడు. మరోవైపు కృష్ణా నదిలో మన నీటిని కట్టడి చేసే పరిస్థితి వస్తే అడిగే నాథుడే లేడు. ఆనాడు బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యతను ఆధారంగా తీసుకుంటే.. నేడు 65 శాతానికి కుదించి, మిగులు జలాల్లో వాటాను ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తుంటే.. ఇతర రాష్ట్రాల ప్రాజెక్టుల ఎత్తు పెంచుకునేందుకు అనుమతి ఇస్తుంటే అడిగే నాథుడే లేకపోతే రైతుల పరిస్థితి ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. కృష్ణా నదికి వరద వస్తే మనల్ని ముంచుతుంది. కానీ మిగులు జలాల్లో మిగిలిన రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని అంటుంటే.. ఇది అన్యాయం అని అడిగే నాథుడే లేడు.

రైతులను మోసం చేసిన ప్రభుత్వం..

ఏ సమస్యనూ తీర్చే పరిస్థితి లేదు: బాబూరావు
కోటవురట్ల సభలో పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావు మాట్లాడుతూ ‘వైఎస్ అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ మళ్లీ అమలు కావాలంటే యువనేతే ఆశాజ్యోతి. ప్రభుత్వం ఏ సమస్యల్నీ కూడా తీర్చే పరిస్థితి లేదు..’ అని పేర్కొన్నారు.
No comments:
Post a Comment