జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, September 2, 2010

ఇక ఫైనల్స్ * ఓదార్పు ఆపేందుకు జగన్ ససేమిరా * ఫలించని మొయిలీ రాయబారం * యువనేత ససేమిరా !

నా కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.. నేతలూ నాతో వస్తేనే మంచిది
యాత్రతో పార్టీకి ప్రయోజనమే.. మొయిలీకి కడప ఎంపీ స్పష్టీకరణ
ప్రకాశం టూరు తర్వాత అయితే ఆలోచిస్తానని ఉద్ఘాటన
చర్యలేమీ ఉండవంటూ ఎమ్మెల్యేలకు అభయం.. యాత్రకు రప్పించే యత్నాలు
యువ ఎంపీ స్పందనపై అదిష్ఠానం ఆగ్రహం..
ఏక్షణమైనా షోకాజ్ జారీ!ఇక నా చేతుల్లో ఏమీ లేదు: మొయిలీ..
హెలిప్యాడ్ వద్ద జగన్‌తో ఆలింగనం
నేగి నుంచే ప్రకాశంలో ఓదార్పు.. గిద్దలూరు నుంచి ప్రారంభం
వైఎస్ కుటుంబం కోసం పదవి పోయినా బాధ పడను : బాలినేని
యాత్న ఆపితే సోనియాకే అవమానం : అంబటి
క్లైమాక్స్‌కు సర్వం సిద్ధమైంది. అధిష్ఠానం ఇచ్చి న ఆఖరి అవకాశాన్నీ కడప ఎంపీ జగన్ కాదన్నారు. ఓదార్పును ఆపేందుకు ససేమిరా అనేశారు. అధిష్ఠానం దూతగా ఇడుపులపాయకు వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ వీరప్ప మొయిలీ మాటను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శుక్రవారం నుంచి ప్రకాశం జిల్లాలో ఓ దార్పు యాత్రను ప్రారంభించి తీ రుతానని జగన్ స్పష్టంచేశారు. మాట తప్పడం.. మడమ తిప్పడం తమ ఇంటా వంటా లేదంటూ తెగేసి చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు తన యాత్రలో పాల్గొంటేనే మంచిదంటూ.. పార్టీ యావత్తూ తన బాటలోకే రావాలని పరోక్షంగా సూచించారు.

కావాలంటే ఆ తర్వాత పార్టీతో కలిసి ఓదార్పులో పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తానంటూ ముక్తాయించారు. పైగా తన ఓదార్పుతో పార్టీకి ప్రయోజనమేనంటూ సూత్రీకరించారు. ఇప్పటిదాకా యాత్రలో పాల్గొన్న వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోని విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రకాశం,నెల్లూరు జిల్లా నేతలను యాత్రకు రప్పించేందుకు జగన్ వర్గం ప్రయత్నాలు ప్రారంభించడం మరో కీలకాంశం.

మొత్తానికి జగన్ స్పందన అధిష్ఠానానికి తీవ్ర ఆగ్రహం కలిగించినట్టు తెలిసింది.ఎంత చెప్పినా జగన్ వినిపించుకోకపోవడంతో.. 'ఐ యామ్ హెల్ప్‌లెస్. ఇక నా చేతుల్లో ఏమీ లేదు' అంటూ, వీరప్ప మొయిలీ నిట్టూర్చారు. జగన్‌ను ఒక్కసారి గట్టిగా ఆలింగనం చేసుకొని హెలికాప్టర్‌లో బెంగళూరు బయల్దేరి వెళ్లిపోయారు. ఇదీ గురువారంనాటి సీన్. ఇక అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరం. యాత్ర ప్రారంభిస్తే ఏ క్షణమైనా షోకాజ్ ఇచ్చేందుకు అది సిద్ధమవుతోందన్నది తాజా సమాచారం! 
యువనేత ససేమిరా !
Jagan-yuva
అధిష్ఠానం మాట వినకుండా సొంత దారిలో వెళుతున్న కడప ఎంపీ వైఎస్‌ జగన్‌కు నచ్చచెప్పి, పార్టీ దారిలో తెచ్చుకునేందుకు అధిష్ఠానం వీరప్ప మొయిలీ ద్వారా పంపిన రాజీ సూత్రాన్ని జగన్‌ తిరస్కరించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్రమంత్రి వీరప్పమొయిలీ గురువారం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపుల పాయకు వచ్చి వైఎస్‌ సమాధి వద్ద నివాళులర్పిం చారు. ఆ తర్వాత జగన్‌, ఆయన తల్లి ఎమ్మెల్యే విజయలక్ష్మితో పావుగంట సేపు చర్చలు జరిపారు. మొయిలీ మాట్లాడుతున్నప్పుడు జగన్‌ మధ్యలో ఎక్కడా అడ్డుపడకుండా మౌనంగా విన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం... తాను సోనియాగాంధీ దూతగానే ఇక్కడికి వచ్చానని, మీ కుటుంబంపై సోనియాకు అభిమానం ఉన్నం దుకే ఆమె తనను హైదరాబాద్‌లో జరిగే అధి కారిక కార్యక్రమానికి కాకుండా, వైఎస్‌ కుటుం బం అమితంగా ప్రేమించే ఇడుపులపాయకు పంపిస్తే వచ్చానని మొయిలీవివరించారు. వైఎస్‌ కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలను సోనియాగాంధీ ఇప్పటికీ ప్రస్తావిస్తుంటారని, కానీ జగన్‌ వ్యవహారశైలి ఆమెలో ఉన్న ఆ సానుభూతి స్థానంలో ఆగ్రహానికి కారణమవుతోందని వారికి స్పష్టం చేశారు. తాను వద్దన్నా వినకుండా ఓదార్పు యాత్రకు వెళ్లడాన్ని ఆమె సహించలేకపోతున్నారని, అదీగాకుండా జగన్‌ తన యాత్రలో ఎక్కడా పార్టీ పేరు ప్రస్తావించ కుండా, రాజకీయ అంశాలు ప్రస్తావించడంపై సోనియా ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఎంతో భవిష్యత్తు ఉన్న జగన్‌ ఈవిధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో విచారించి, నచ్చచెప్పి సరైన దారిలో వెళ్లేలా చూడాలని తనను ఆదేశించినట్లు వారికి వివరించారు.

amma
ఓదార్పు యాత్రలో సోనియాగాంధీ, పార్టీ పేరు, వైఎస్‌కు పార్టీ ఇచ్చిన అవకాశాలను ప్రస్తావించడం ద్వారా సోనియా ఆగ్రహాన్ని చల్లార్చాలని మొయిలీ సూచించారు. పార్టీకి విధేయత ప్రకటించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తును కాపాడుకోవాలని జగన్‌కు సలహా ఇచ్చారు. మీకు మద్దతుదారుగా ఉన్నట్లు తనపై కూడా దుష్ర్పచారం జరుగుతోందని మొయిలీ వాపోయారు. ప్రస్తుతం పార్టీలో మీకు వ్యతిరేక వాతావరణం ఉందని, దానిని విధేయ వైఖరితో సానుకూలంగా మార్చుకోవాలని సలహా ఇచ్చారు. ఒకవేళ కాదని, ఓదార్పు యాత్రకు వెళితే అధిష్ఠానం చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో ఉందని, క్రమశిక్షణ కమిటీ కూడా కేవలం మీ యాత్ర, అందులో మీరు అనుసరించే వ్యవహారశైలి కోసమే ఎదురుచూస్తోం దని స్పష్టం చేశారు. అయితే, తాను పార్టీపై తిరుగుబాటు చేయడం లేదని, ఓదార్పు యాత్రకు వస్తానని తన తండ్రి మృతి చెందిన రోజు నల్లకాలువ వద్ద ప్రకటించిన విషయాన్ని జగన్‌ ఆయన వద్ద గుర్తు చేశారు.

పార్టీ కార్యకర్తలు మృతి చెందిన సమయంలో వారిని పరామర్శించడం తప్పెలా అవుతుందని, దానిని నాయకత్వం కూడా తన ప్రత్యర్థుల మాటలు విని తనను అణచివేసే విధంగా వ్యవహరించడం సరైంది కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వం కూడా పోటీ ఓదార్పు యాత్రను ప్రారంభించడాన్ని జగన్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజలకు అన్నీ తెలుసు అని మాత్రమే వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రోశయ్య తనను అణచివేయడమే పనిగా పెట్టుకున్నారని, తన ప్రత్యర్థులు ప్రతిరోజూ ఆయనను కలుస్తున్నారని, సీఎంను కలిసిన తర్వాత వారు తనపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారని, మళ్లీ సీఎంను కలుసుస్తున్నారని ఫిర్యాదు చేశారు. తన యాత్రకు వెళ్లవద్దని ఎమ్మెల్యేలకు స్వయంగా ఫోన్లు చేయటంపెద్ద మనిషి లక్షణమా అని అసహనంతో ప్రశ్నించారు.

ఇప్పటికే నాలుగు జిల్లాల్లో ఓదార్పు యాత్ర పూర్తి చేసినందున, మిగిలిన జిల్లాల్లో కూడా పర్యటించి, బాధిత కుటుంబాలను ఓదార్చ వలసిన బాధ్యత తనపై ఉందన్నారు. మడమ తిప్పని యోధుడిగా పేరున్న రాజశేఖరరెడ్డి తనయుడిగా ఇచ్చిన మాట నెరవేర్చడం తన ధర్మమని వాదించారు. ఓదార్పు రాజకీయాలతో సంబంధం లేని యాత్ర అని, తాను వెళ్లేది ఖాయమని తేల్చిచెప్పారు. ‘మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు సహకరించండి. నేను ఓదార్పు తర్వాత పార్టీ అధ్యక్షురాలిని వచ్చి కలుస్తా. ఆలోగా మీరు చర్యలు తీసుకోవాలంటే మీ ఇష్టం. నేను అన్ని ంటికీ సిద్ధమయ్యే ఉన్నా. మీరు వ్యక్తిగతంగా నాపై చూపిన అభిమానానికి, మా కుటుంబంపై చూపిన ప్రేమకు కృతజ్ఞత’లని జగన్‌ చెప్పారు. ఆ తర్వాత మొయిలీ వెళ్లే సమయంలో వారిద్దరూ ఆలింగం చేసుకున్నారు.

No comments:

Post a Comment