జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, December 9, 2010

జనంలోకి జగన్‌ * రైతులకు జగన్ పరామర్శ

crowd-jagann
సొంత పార్టీ స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన ఉన్నతికి కేవలం తండ్రి పేరు వినియోగించు కోవడం ఒక్కటే కాకుండా, తనకు తాను ప్రజానాయకుడిగా ఎదిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ మేరకు ఆయన కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.జగన్‌ నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తుండగా, రాష్ట్రంలో జల్‌ తుపాను సంభవించింది. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి, రైతు లకు బాసటగా నిలిచారు. అయితే, జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఓదార్పు యాత్రకే పరిమితమయ్యారు. జల్‌ తుపాను వల్ల నెల్లూరు-ప్రకాశం జిల్లాలు కూడా దెబ్బతిన్నప్పటికీ, అక్కడే ఉన్న జగన్‌.. పంట నష్టపోయిన రైతులను పరామర్శించటం గానీ, వారిని సానుభూతి ప్రకటించటం గానీ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

దానిని పరిగణనలోకి తీసుకున్న జగన్‌.. గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోతున్న రైతాంగాన్ని పరామర్శించి, వారికి బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం.. ఆయన శు్ర వారం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో రైలుమార్గం ద్వారా గుంటూరు-కృష్ణా జిల్లాలలో పర్యటించేందుకు సిద్ధమవుతు న్నారు. ఆ మేరకు ఆయా జిల్లాల నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నా రు. ఇప్పటివరకూ కేవలం తండ్రి పేరు చెప్పుకుని ప్రచారం చేసుకోవడం వల్ల సొంతగా ఎలాంటి బలం లేదని, తండ్రి పేరు- ఫొటో లేకపోతే తప్ప మనుగడ లేదన్న తప్పుడు సంకేతాలు వెళితే, భవిష్యత్తులో తాను నాయకుడిగా ఎదగడం కష్టమని గ్రహించిన జగన్‌.. ఆమేరకు తన తండ్రి పేరు వినియోగించుకోవడంతో పాటు, స్వయంగా తాను జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

అందుకే ఆయన రైతులను పరామర్శించేందుకు రైతుబాట పట్టనున్నట్లు కనిపిస్తోంది. వైఎస్‌ రైతు కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్రలతో పాటు, తరచూ జనంలోకి వెళ్లిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న జగన్‌.. తాను కూడా తండ్రి బాట పట్టకుండా, కేవలం ఆయన పేరును మాత్రమే వాడుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించారు. దానితో ఇకపై తరచూ సమస్యలు తెలుసుకునేందుకు జనంలోకి వెళ్లాలని తీర్మానించుకు న్నట్లు కనిపిస్తోంది.
 వర్షబాధిత ప్రాంతాలైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నేడు, రేపు పర్యటన

నేటి ఉదయం ‘జన్మభూమి’ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరనున్న యువనేత
గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనేడు, రేపు జగన్ పర్యటన

చేతికొచ్చిన పంట కళ్ల ముందే నీళ్ల పాలవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగాన్ని పరామర్శించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నడుం బిగించారు. శుక్ర, శనివారాల్లో ఆయన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్నారు. వివిధ గ్రామాల్లో ధ్వంసమైన పంట పొలాలను పరిశీలించనున్నారు. జగన్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.

శుక్రవారం పర్యటన వివరాలు

ఉదయం 7.10 గంటలకు హైదరాబాద్ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదే రతారు.
మధ్యాహ్నం 12.25 గంటలకు గుంటూరు జిల్లా తెనాలికి చేరుకుంటారు.
చుండూరు మండలం చినపరిమిలో వరి పొలాలను సందర్శిస్తారు.
అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలోని పంట పొలాలను పరిశీలిస్తారు.
పెదపూడి రైతులను పరామర్శిస్తారు.
అమృతలూరు మండల కేంద్రంలో, గోవాడ ప్రాంతాల్లో పర్యటిస్తారు.
చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి, పొన్నపల్లి, నడింపల్లి, గూడవల్లి, కనగాల ప్రాంతాల్లో పంటనష్టాన్ని పరిశీలిస్తారు.
భట్టిప్రోలు మండలం శివంగులపాలెం వెళ్లి ఆ తరువాత భట్టిప్రోలు చేరుకుంటారు.
భట్టిప్రోలు మండలం వేమవరం, సూరేపల్లి, కోనేటిపురం ప్రాంతాలను సందర్శిస్తారు
రేపల్లె మండలం కారుమూరు, పెదవరికూటివారిపాలెం, పేటేరు ప్రాంతాల్లో పర్యటిస్తారు.
అక్కడినుంచి రేపల్లెకు చేరుకుంటారు.
రాత్రికి కృష్ణా జిల్లా అవనిగడ్డలో బసచేస్తారు.

శనివారం పర్యటించే ప్రాంతాలు

అవనిగడ్డ నుంచి బయలుదేరి బందలాయి చెరువు, వేకనూరు ప్రాంతాల్లో పర్యటిస్తారు.
నాగాయలంక మండలం తుంగలవారిపాలెం, వక్కపట్లవారిపాలెంలను సందర్శిస్తారు.
కోడూరు మండలం పోటుమీద, మందపాకల, లింగారెడ్డిపాలెం, కోడూరు, కృష్ణాపురం, జయపురం, మాచవరం, కొత్తపేట ప్రాంతాల్లో పర్యటిస్తారు.
అవనిగడ్డ మండలం అవనిగడ్డ, పులిగడ్డల్లో పొలాలను పరిశీలిస్తారు.
మోపిదేవి మండలం మోపిదేవి, పెదప్రోలు, కొత్తవానిపాలెం వెళతారు.
చల్లపల్లి మండలం చల్లపల్లి, లక్ష్మీపురం, లంకపల్లి, మాజేరు, జీలకరగ్రండిలో పంట నష్టాన్ని చూస్తారు.

బందరు మండలం గుండుపాలెం, రుద్రవరం, మచిలీపట్నం మీదుగా ఎస్‌ఎన్ గొల్లపాలెం, సీతారామపురం గ్రామాలకు చేరుకుని పంటలను పరిశీలిస్తారు. అక్కడి రైతులను పరామర్శిస్తారు.

అదేరోజు రాత్రి విజయవాడ నుంచి రైలులో బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

ఇది రైతాంగానికి కష్టకాలమని, వారంతా విషాదంలో మునిగి ఉన్నారని.. వారిని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నందున ఏ విధమైన ఆర్భాటాలకు తావివ్వరాదని సీనియర్ నేత, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు ఈ మేరకు మరీమరీ విన్నపం చేస్తున్నామని చెప్పారు. నాట్లు వేసినప్పటి నుంచి చివరివరకు రైతన్నలు వానలతో ఎన్నో కష్టనష్టాలకోర్చుకున్నారని, చివరకు ఎంతో కొంత చేతికి వస్తుందని ఎదురుచూస్తున్న సమయంలో మళ్లీ విరుచుకుపడిన వర్షాలు రైతుల్ని కోలుకోకుండా చేశాయని రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment