జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, December 23, 2010

ఈ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది, భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు * లక్ష్యదీక్ష విర మణలో విరుచుకుపడిన జగన్

రైతు కోసం ఎంతో ఆలోచించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్ఫూర్తి ఏమాత్రం లేని రాష్ట్ర ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది. అవునా కాదా అని వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిందని ఆయన చెప్పారు. ఈ ప్రభుత్వంపై ఇలాంటి రైతు ఆందోళనలు ఇంకా ముమ్మరం చేస్తాం అని హెచ్చరించారు.

ఎంతో ఘోర విపత్తు సంభవించి రైతు దిక్కు తోచని స్థితిలో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోందని ఆయన విరుచుకుపడ్డారు. రైతు పండించిన ధాన్యం తడిచిపోతే, రంగు మారిపోతే ప్రభుత్వం కాక మరెవరు కొంటారని జగన్ ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో రైతు సోదరుడు ఏ గోదారిలోకి పోవాలి అని అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఇక ఎవరు పట్టించుకోవాలి, తినడానికి లేని పరిస్థితిలో ప్రభుత్వం నిద్రపోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు సంక్షేమాన్ని విస్మరించడంలో నేటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొందూ దొందేనని ఆయన విరుచుకుపడ్డారు. ప్రకృతి వైపరీత్యానికి తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతన్నల ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం ఒక రైతు ఇచ్చిన నిమ్మరసం త్రాగి జగన్ గురువారం 12 గంటలకు తమ 48 గంటల లక్ష్య దీక్ష విరమించారు.

దీక్ష విరమించే ముందు ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ వై.ఎస్. స్ఫూర్తి ఈ సర్కారుకు ఉందా ?
రైతుల పట్ల అనుసరిస్తున్న ఈ ప్రభుత్వ వైఖరి సరైనదేనా ? అని సభను ఉద్దేశించి ప్రశ్నించారు.

click here 

నేనున్నాననీ...
రెండు రోజులుగా మెతుకు ముట్టని జగన్ రైతుల బాధలు విని చలించిపోయారు. నేనున్నానని ఓదార్చారు. మహిళలు, విద్యార్థినులు అభిమాన నేత ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. బుధవారం కూడా పలువురు నేతలు, వారి కుటుంబ సభ్యులు జగన్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు.

‘ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యాన్ని కోల్పోవద్దు. మీకు అండగా నేను ఉంటాను అంటూ యువనేత వైఎస్ జగన్మోహనరెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రైతులు, చేనేత కార్మికులను ఆదుకోవాలన్న డిమాండ్‌తో చేపట్టిన 48 గంటల సామూహిక నిరాహార దీక్షలో రెండోరోజు బుధవారం ఆయన రైతుల సమస్యలపై ముఖాముఖి చర్చించారు. దీక్ష ప్రారంభించి 30 గంటలు దాటిపోవడంతో బుధవారం సాయంత్రానికి యువనేత కొంచెం నీరసంగా కనపడ్డారు. అయినా తనను పలకరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తూ, కొందరితో కరచాలనం చేస్తూ, వారి బాధలను శ్రద్ధగా వింటూ ఓదార్చారు.

పంట అంతా వర్షార్పణమైందయ్యా..
వరి, పత్తి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఈ సందర్భంగా రైతులు వివరించారు. వరిసాగు కోసం ఎకరాకు రూ. 15 వేల నుంచి రూ. 25 వేలు ఖర్చు చేస్తే పంట వర్షార్పణమైందని, తడిసి ముద్దయిన పత్తి రంగుమారడంతో కొనే నాథుడే కరువయ్యాడని వాపోయారు. మిర్చిపంట కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని గొల్లుమన్నారు. పంట నష్టం నమోదు సక్రమంగా జరగడం లేదని, ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదన్న అభిప్రాయాన్ని రైతులు వెలిబుచ్చారు. రైతన్నల దీనగాథలు విన్న యువనేత వారికి ధైర్యం చెప్పారు. నేనున్నానని ఓదార్చారు. మంచికాలం ముందుందని భుజం తట్టారు. ఆయన మాటలు వారిలో వ్యవ‘సాయం’పై కొత్త ఆశలు చిగురింపజేశాయి.

పూజ చేసిన అక్షింతలు తెచ్చి ఆశీర్వదించిన తూర్పు గోదావరి మహిళ

జగన్ ఆత్మీయ స్పర్శ కోసం మహిళలు క్యూ కట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకూ దీక్షా శిబిరం వద్ద మహిళలు అధిక సంఖ్యలో కనిపించారు. జగన్‌తో కరచాలనం చేసేందుకు బారులు తీరారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన ఆదెమ్మ కనకదుర్గ అమ్మవారి వద్ద పూజ చేసిన ఆక్షింతల్ని తెచ్చి జగన్ శిరస్సుపై వేసి అభిమానాన్ని చాటుకుంది.

వైఎస్ ఫొటోను చచ్చేదాకా దాచుకుంటా : మరో మహిళ అంతరంగం

అదే జిల్లాకు చెందిన మరో మహిళ వైఎస్‌ఆర్ ఫొటోను తెచ్చి వెనుక సంతకం చేయమని కోరింది. ఎందుకమ్మా అని జగన్ అడగ్గా, నువ్వు సంతకం చేసిస్తే నాన్న (వైఎస్‌ఆర్) ఫొటోను చచ్చేదాకా దాచుకుంటానని చెమ్మగిల్లిన కళ్లతో చెప్పింది. దీంతో జగన్ సంతకం చేశారు. పాఠశాల, కళాశాల విద్యార్థినులు ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. పోలీసులు బలవంతంగా లాగేస్తున్నప్పటికీ యువనేత సంతకం చేసే వరకూ కదల్లేదు. పసిబిడ్డల్ని జగనన్న ముద్దాడిన తీరు మహిళల్ని ఎంతగానో ఆక ట్టుకుంది.

పెరుగుతున్న సంఘీభావం

బుధవారం కూడా పలువురు నేతలు, వారి కుటుంబ సభ్యులు జగన్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. శిబిరం వద్దకు రాలేనివారు తమ బంధువులను పంపుతున్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తల్లి, భార్య, సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం దీక్షా శిబిరానికి వెళ్లి జగన్‌కు సంఘీభావం ప్రకటించారు. జిల్లా నుంచి ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయభాను, నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యే పేర్ని నాని బ్యానర్లతో వందలాది మంది దీక్షా శిబిరం వద్దకు తరలి వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి సోదరుడు పద్మనాభరెడ్డి, రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం సోదరుడు రవి తదితరులు జగన్‌కు సంఘీభావం ప్రకటించగా పలువురు ఫోన్‌లో జగన్‌ను పరామర్శించారు.

నేడు 9 గంటలకు ముగింపు సభ

జగన్ చేస్తున్న 48 గంటల సామూహిక నిరాహార దీక్ష గురువారం ముగియనుంది. ఉదయం 9 గంటలకు వైఎస్సార్ ప్రాంగణంలో ముగింపు సభను నిర్వహిస్తున్నట్లు ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు ప్రకటించారు. ఈ సభకు రైతులు, చేనేత కార్మికులు భారీసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment