జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Tuesday, December 21, 2010

రైతు గుండె చప్పుడు వినిపించడానికే ఈ లక్ష్య దీక్ష రైతుకు న్యాయం చే యకపోతే డిపాజిట్లు కూడ రావు ఇంకా ఎంతమంది చనిపోవాలి ? : నిప్పులు చెరిగిన జగన్

రైతు గుండె చప్పుడు వినిపించడానికే ఈ లక్ష్య దీక్ష ఏర్పాటు చేసినట్టు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారంనాడు ఇక్కడ ప్రకటించారు. కృష్ణమ్మ నదీ తీరాన చేరిన ఈ రైతు స్పందన చూసైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో రైతాంగం మీద దెబ్బ మీద దెబ్బ పడుతోంది, అయినా ప్రభుత్వానికి చీమైనా కుట్టినట్టు లేదని ఆయన అన్నారు. ఇంకా ఎంత మంది రైతులు చనిపోవాలి? అని జగన్ ప్రశ్నించారు. మాట ఇస్తే ఆ మాట మీదే నిలబడాలి, ఎన్నాళ్లు బతికామని కాదు, ఎలా బతికామనేదే ముఖ్యం అనేవారు దివంగత నేత వై.ఎస్. అని ఆయన గుర్తు చేసుకున్నారు. చెప్పిన మాట మీదే నిలబడాలి, మడమ తిప్పకుండా మాట నిలబెట్టుకోవాలని చెప్పేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.

లక్ష్యదీక్ష ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రతి రైతు సోదరునికీ కూడా ఉచితంగా కరెంటు ఇవ్వాలని వై.ఎస్. ఆకాంక్షించారని, ఆరోజున పాలకపక్షమైన తెలుగుదేశం పార్టీ కరెంటు తీగలమీద బట్టలు ఆరేసుకోవాలని అనినప్పటికీ, మాట ఇచ్చాం కాబట్టి కష్టమైనా నష్టమైనా కరెంటు ఇవ్వాల్సిందేనని వై.ఎస్. ఉచిత కరెంటు ఇచ్చారని, 1800 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందంటే, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ ఫైలుపై వై.ఎస్. సంతకం చేశారని, ఆయన గుర్తు చేసుకున్నారు.

ఏ ప్రభుత్వమైనా రైతుల పక్షపాతిగా నిలబడకపోతే, ఆ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని చెబుతున్నాను నేను. ఏనాడైతే రైతు కన్నీటిని చూస్తామో ఆనాడు రాష్ట్రానికి అధోగతి పడుతుంది, అది అరిష్టం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు కన్నీరు కనిపించడం లేదా అని అడుగుతున్నాను. కేవలం 600 మాత్రమే ఇస్తామంటున్నారు. అది ఏ మూలకు అని అడుగుతున్నాను నేను. ప్రతి రైతు సోదరునికి కూడా న్యాయం చేయాలంటున్నాను, ఈ రైతు గుండె చప్పుడు వారికి వినపడితే అదే పదివేలు.

ఇన్‌పుట్ సబ్సిడీని రెట్టింపు చేయమని అడిగితే, 1800 సరిపోదు, 3600 కావాలని చెబితే కేవలం 600 మాత్రమే పెంచారు. ఆ 600 రూపాయలు యూరియా ఒక బస్తాకు కూడా సరిపోదు. ఈ విషయం ప్రభుత్వానికి కనిపించడం లేదా అని అడుగుతున్నాను. రంగు మారిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెబితే, ఆ మొలకెత్తిన ధాన్యాన్ని కొనమని చెబితే, ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం మాత్రమే కొంటానని అంటున్నది. నష్టపోయిన ప్రతి రైతుకూ సాయం చేయాలని కోరుతున్నాను, పూర్తిగా కొన వలసిందేనని అడుగుతున్నాను నేను. కనీస మద్దతు ధర ఇచ్చి కొనవలసిందని అడుగుతున్నాను నేను. రైతుకు కనీసం వెయ్యి రూపాయలు ఇవ్వాలి. పక్క రాష్ట్రం కర్నాటకను చూస్తే, ఈ రాష్ట్రంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. మిగిలిన రాష్ట్రాలకంటె బాగా చేయాలని కోరుతున్నాను. వచ్చే రబీకి ఉచితంగా విత్తనాలు ఇస్తేనే రైతు సంక్షేమం సాధ్యమవుతుందని చెబుతున్నాను అని జగన్ అన్నారు.

దివంగత వై,ఎస్. బాటలోనే నడుస్తామని చెబుతున్న ఈ ప్రభుత్వం కొంచమైనా రైతు శ్రేయస్సుకోసం కృషి చేస్తుందనుకున్నా. ఏమీ చేయడం లేదు. మహానేత బాటలోనే నడుస్తానన్న ఈ ప్రభుత్వం రైతులపై ప్రేమ చూపిస్తుందనే అనుకున్నాను. కాని ఆయన ఆశయాలను ఈ ప్రభుత్వం మరిచిపోయింది. ఆ మహనీయుని ఆశయాలు ఏమయ్యాయని అడుగుతున్నాను. ఎన్నికలు ఇంకా మూడేళ్లు ఉందని ఈ ప్రభుత్వం అనుకుంటున్నట్టుంది. రైతుకోసం ఏమీ చేయకపోతే, పావలా వడ్డీ ఇవ్వకపోతే, చేనేత కార్మికులను ఆదుకోకపోతే, వచ్చే ఎన్నికల్లో ఆ మూడేళ్ల తర్వాత కనీసం డిపాజిట్లు కూడా రావని ఆయన పునరుద్ఘాటించారు. రైతుల వేదన చూస్తే గుండె తరుక్కుపోతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

click here

No comments:

Post a Comment