జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, July 8, 2010

నాడు వనం.. నేడు జనం

Ysrజులై 8...ఒక మహానేత జయంతి... జనం కోసమే జనించిన ఒక రాజకీయ రాజసయోధుడు..పేదల పక్షపాతి పుట్టిన రోజు.చరిత్ర మరవని చరితను సొంతం చేసుకున్న యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి..వైఎస్సార్‌ ఈ గడ్డపై అడుగిడిన రోజు. పుట్టిన రోజును జరుపుకోవడానికి ఆయన లేడు. కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఇంకా ఉన్నాయి..ఉంటాయి కూడా... ఆయన మరణం తర్వాత భౌతికకాయాన్ని కడప జిల్లాలోని ఆయనకు ఇష్టమైన ప్రదేశం అయిన ఇడుపులపాయ ఎెస్టేట్‌లో ఖననం చేశారు. వైఎస్‌ బతికున్న రోజుల్లో ఎప్పుడు విడిది చేసినా ఇడుపులపాయలోనే గడిపేవారు.

ఆయనకు ఆ ప్రాంతం అంటే మక్కువ. ఆయన మరణం తర్వాత ఇడుపులపాయను వైఎస్‌ఆర్‌ ఎెస్టేట్‌గా పిలుస్తున్నారు. ఆ ప్రదేశంలో వైఎస్‌ స్థూపం ఏర్పాటుచేయడంతో పాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో కేవలం వైఎస్‌ కుటుంబ సభ్యులు మాత్రమే సందర్శించే ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ప్రతిరోజు వందలాది మంది వైఎస్‌ అభిమానులు సందర్శిస్తుండడంతో ఇడుపులపాయ పర్యాటక ప్రాంతాన్ని తలపిస్తోంది. మరోవైపు ఆయన మరణించిన నల్లమల ప్రాంతంలోనూ వైఎస్‌ స్మారక పార్కు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది.

పచ్చని పంట పొలాలతో....
nallamalaచుట్టూ ఎత్తయిన కొండలతో.. పచ్చని తివాచీ పరిచినట్లుండే ప్రాంతం ఇడుపులపాయ. సుమారు 100 ఎకరాల్లో విస్తరించి కడపజిల్లా పులివెందుల నియోజకవర్గానికి 40 కిలోమీటర్ల దూరంలో వెంపల్లి మండలంలో ఈ ప్రాంతం ఉంది. వైఎస్‌ బతికున్నన్ని రోజులూ కడపకు ఎప్పుడు వెళ్లినా... ఇడుపుల పాయను సందర్శించేవారు. గతంలో సుమారు 600 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎస్టేట్‌లో అసైన్డ్‌ భూములను వైఎస్‌ స్వయంగా పేదలకు పంచిపెట్టారు.

అభివృద్ధికి పెద్దపీట...
వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇడుపులపాయను అభివృద్ధి చేసేందుకు నడుం బిగించారు. దానిలో భాగంగానే రూ.1,300 కోట్లతో ట్రిపుల్‌ ఐటి, రూ.100 కోట్లతో యోగి వేమన విశ్వవి
ద్యాలయం వెస్ట్‌ క్యాంపస్‌, రూ.8 కోట్లతో ఎకోపార్కు వంటి నిర్మాణాలతో ఆ ప్రాంతం అభివృద్ధికి వైఎస్‌ కృషిచేశారు. దీనితోపాటు ఇడుపులపాయనుంచి జిల్లాలో ఏర్పాటు చేసిన యోగివేమన వర్సిటీ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేయాలని ప్రతి పాదిం
చారు. గోల్ఫ్‌ కోర్సు, ఇతర అభివృద్ధి పనులు కూడా జరగనున్నాయి. మరోవైపు వైఎస్‌ స్మారకార్థం ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మలిచేందుకు ప్రభుత్వం యోచితస్తోంది.

పార్కు నిర్మాణం....
jagan-janamఇడుపులపాయలో వైఎస్‌ ఘాట్‌ను నిర్మించడంతో పాటు ఆ ప్రాంతాన్ని ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. వైఎస్‌ ఉన్న సమయంలోనే నెమళ్ల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దానికోసం 67 నెమళ్లను కూడా ఆయన ఆర్డర్‌ చేశారు.ఆయన మరణానంతరం ఇక్కడ పార్కు నిర్మాణంతో పాటు విడిది ఏర్పాట్లను కూడా చేయాలనే ప్రతిపాదన ఉంది.

పావురాలగుట్టలోనూ...
సెప్టెంబర్‌2న వైఎస్‌ ప్రమాదంలో మరణించిన నల్లమల అడవిలోని పావురాలగుట్ట ప్రాంతాన్ని కూడా పర్యాటక ప్రాంతంగా మలిచేందుకు ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టిం ది. దీనికోసం 1,412 హెక్టార్ల నల్లమల రిజర్వ్‌ పారెస్ట్‌ ఏరియాను వైఎస్‌ స్మారక పార్కు నిర్మాణానికి కేటాయిస్తూ ప్రతిపాదనలు కూడా చేసింది. అలాగే నల్లమల అటవీప్రాంతానికి సమీపంలోని నల్లకాలువ గ్రామంలో రూ.3.15 కోట్ల వ్యయంతో వైఎస్‌ఆర్‌ స్మృతివనం ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది.

YSR-FAMILY-PHOTOSపావురాలగుట్టలో స్మారక స్థూప నిర్మాణం కూడా ఏర్పాటు చేయను న్నారు. ఈ ప్రాంతం పూర్తిగా అటవీ ప్రాంతం కావడం, ఇక్కడే వన్యప్రాణి సంరక్షణ ప్రదే శం కావడంతో పార్కు నిర్మా ణం మూలంగా వన్యప్రా ణులకు ఎలాం టి ఇబ్బందులు కలగకుం డా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలు అనుమతిస్తే వెంటనే ఈ ప్రాజెక్టును ప్రారం భించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ బృహత్తర పథకం ప్రారంభమయితే ఈ ప్రాంతం రాష్ట్ర ప్రఖ్యాత పర్యాటక కేంద్రా లలో ఒకటి గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

No comments:

Post a Comment