జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Saturday, July 10, 2010

అంత డబ్బెక్కడిది? కాంగ్రెస్‌ది పదవుల కోసం ఆరాటం: బాబు - ‘దేశం’ పై జ‘గన్‌’!

వైఎస్ కొడుకు కావడం తప్ప
జగన్‌కు ఉన్న అర్హత ఏమిటి?
వేటగాడిలా పథకాల ఎర వేశారు
వేల కోట్లు పిండుకున్నారు
మాది ప్రజల కోసం పోరాటం
'రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, ప్రకృతి వైపరీత్యాల మరణాల సమయంలో నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వాలే ముందూ వెనకా చూసుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఇవ్వలేనంత డబ్బు జగన్ ఎలా ఇవ్వగలుగుతున్నారు?' ఇది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్న. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 'ఓదార్పు' గురించి ప్రస్తావించారు.

'వైఎస్ చనిపోయినప్పుడు ఆవేదనతో మరణించారంటూ 700 మందిని లెక్కగట్టి తలా రూ. లక్ష చొప్పున ఇస్తున్నారు. అంటే రూ.7 కోట్లు పంచుతున్నారు. జగన్‌కు ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది?' అని ప్రశ్నించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత ముద్దు కృష్ణమ నాయుడు జోక్యం చేసుకున్నారు.

'బాధిత కుటుంబాలకు ఇస్తున్నది ఏడుకోట్ల రూపాయలైతే, పరామర్శ పేరుతో జరుపుతున్న యాత్రకు పెడుతున్న ఖర్చు వంద కోట్లు' అని తెలిపారు. 'వైఎస్ ముఖ్యమంత్రికాక ముందు జగన్ ఆదాయం ఎంత? ఆస్తులెన్ని? ఇప్పుడు ఎన్ని? అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సొంత పత్రిక సాక్షికి ఏడాదిలో రూ.250 కోట్ల నష్టం చూపించారు. అంత నష్టం భరించేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?' అని బాబు ప్రశ్నించారు.

వివాదాలకు, నెగెటివ్ అంశాలకు ప్రచారం ఎక్కువ వస్తుందని, జగన్ యాత్ర విషయంలో అదే జరుగుతోందని చెప్పారు. తాము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు పదవులు, అధికారం కోసం పోరాడుకొంటున్నారన్నారు.

జగన్ పార్టీ పెడితే రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీల మధ్యే కీలక పోరు ఉంటుందా అని ప్రశ్నించగా. 'రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీలు కొత్త కాదు. చాలామంది పెట్టారు. తర్వాత అవి కనిపించలేదు'' అని అన్నారు.

చతికిలబడుతున్న రోశయ్య
దివంగత ముఖ్యమంత్రి కుమారుడు కావడం మినహా జగన్‌కు ఉన్న అర్హత, ప్రత్యేకత ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. "వేటగాళ్లు పక్షులకు ఎర వేసినట్లుగా వైఎస్ రేషన్ కార్డులు, పింఛన్లు, ఆరోగ్య శ్రీ కార్డులు వంటి పథకాలు విసిరి ప్రజలను ఆకట్టుకున్నారు. వాటిచాటున రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోపిడీ చేశారు. ఆ తర్వాత రోశయ్యకు జాక్‌పాట్ తగిలి వచ్చారు. కానీ, ఏమీ చేయలేక చతికిలబడుతున్నారు' అని అన్నారు.

వారంపాటు తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని రోశయ్య చేసిన ప్రకటనను తేలిగ్గా తోసిపుచ్చారు. 'సీఎం పదవి నాకేమైనా కొత్తా? రోశయ్య మాకు ఇచ్చేదేమిటి? కాంగ్రెస్ అధిష్ఠానం ఇస్తే ఆయన తీసుకున్నారు. మాకు ప్రజలే అధిష్ఠానం. ఇస్తే వాళ్లే ఇస్తారు'' అని అన్నారు.
‘దేశం’ పై జ‘గన్‌’!
chandruకాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి, సొంత పార్టీ పెట్టాలని యోచి స్తున్న కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే లక్ష్యంతో వ్యూహరచన చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలతో విసిగెత్తిపోయిన వారిని తన పార్టీలో చేర్చుకోవాలని జగన్‌ పావులు కదుపుతున్నట్లు సమాచారం. పార్టీలో సగానికి పైగా బాబుపై అవిశ్వాసంతో ఉన్నట్లు గమనించిన జగన్‌ దానిని సద్వినియోగం చేసు కునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. దీనికోసం 10 వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో చంద్రబాబునాయుడును తీవ్రంగా వ్యతి రేకిస్తున్న కర్నాటక మైనింగ్‌ కింగ్‌ ఒకరు ప్రధాన సూత్రధారిగా పనిచేస్తున్నారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో కీలకమైన నేతలను గుర్తించి వారి అవసరాలను తీర్చి, తన పార్టీలో చేర్చుకోవాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా, ఆ పార్టీకి అత్యంత కీలకమైన నాయకులకు 25 కోట్ల రూపాయల చొప్పున ఆఫర్‌ చేసి, వారిని పార్టీ వైపు ఆకర్షించాలని భావిస్తున్నారు. ఈ విషయంలో సీనియారిటీ బట్టి రేటు నిర్ణయిస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగా అనంతపురం, వరంగల్‌, గుంటూరు, విశాఖ, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన కొందరు నేతలను గుర్తించారు.

టీడీపీలో యువకులు నిరాశగా ఉన్నారని, నమ్ముకున్న వారికి చంద్రబాబునాయుడు న్యాయం చేయడం లేదని, బీసీ నేతలకూ సరైన న్యాయం చేయడం లేదని, ఎన్నికల వరకూ ఆ పార్టీలో ఎంత మంది ఉంటారో తెలియని పరిస్థితి ఉందని జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కోసం అంకితభావంతో పనిచేస్తున్న సీనియర్లు కూడా ఆయన తమకు న్యాయం చేయ రన్న అపనమ్మకంతో ఉన్న వాతావరణాన్ని సద్వినియోగిం చేసు కోవాలని భావిస్తున్నారు. వారి ఆర్థిక అవసరాలుతీర్చడం ద్వారా వారందరినీ పెద్ద సంఖ్యలో తీసుకుని టీడీపీని దెబ్బతీయాలన్నది జగన్‌ అసలు లక్ష్యమంటున్నారు. వైఎస్‌ మృతి చెందడ ంతో ఇక తానే ముఖ్యమంత్రినన్న మితిమీరిన ఆత్మవిశ్వా సంతో ఉన్న బాబు తమను లెక్కచేయడం లేదన్న అసంతృప్తిని వినియోగించుకుని ఏవిధంగానైనా తన వైపు తీసుకురావాలన్నది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.

అదే విధంగా, కాంగ్రెస్‌తో పాటు టీడీపీలో కూడా వృద్ధతరం నేతలే ఎక్కువయ్యారని, వాళ్లు పార్టీలో ఉన్నంతకాలం తమకు భవిష్యత్తు లేదన్న అసంతృప్తితో ఉన్న యువ నేతలను కూడా లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిసింది. సదరు యువ నేతలు కూడా జగన్‌ వెంట యువకులే ఎక్కువగా ఉన్నందున తాము కూడా ఆయన పార్టీలోకి వెళ్లా లని యోచిస్తున్న సమాచారం అందిందని తెలి సింది. బాబు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తాను అనుకున్నదే చేస్తుండటంతో పార్టీకి, తమకు భవిషత్తు లేదని యువనాయకులు భావిస్తున్నం దున, వారిని గుర్తించి వారి ఆర్థిక అవసరాలు తీర్చ డం ద్వారా జగన్‌ వైపు చేర్చాలని ఆయన వర్గీ యులు వ్యూహరచన చేస్తున్నారు. ఇదిలాఉండగా, జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కర్నాటక మైనింగ్‌ కింగ్‌ ఒకరు దేశవ్యాప్తంగా ఉన్న వేదపండితులను పిలిపించి వారితో సుదర్శనయాగం బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ లక్ష్యం కోసం పనిచేస్తున్న సదరు ప్రముఖుడు కాంగ్రెస్‌ను కాకుండా ప్రధానంగా చంద్రబాబునాయుడును దెబ్బతీసేందుకే వ్యూహరచన చేస్తున్నారు.

No comments:

Post a Comment