జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, July 8, 2010

భవిష్యత్ నేత జగనే!

భవిష్యత్ నేత జగనే!
అధిష్ఠానాన్ని ఆయన గౌరవించాలి: సబిత

తాండూరు : భవిష్యత్ నాయకుడు వైఎస్ జగనేనని హోం మంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు. గురువారం రాత్రి ఆమె తాండూరులో విలేఖరులతో మాట్లాడారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డికి కొడుకు కావడం వల్లే జగన్‌కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని మంత్రి చెప్పారు. అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించాలని.. తాను, వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి రెండుగంటలపాటు జగన్‌కు నచ్చజెప్పామని తెలిపారు.

తాము అధిష్ఠానాన్ని గౌరవిస్తూనే వైఎస్ కొడుకుగా జగన్‌నూ.. ఆదరిస్తామన్నారు. అధిష్ఠానం ఓదార్పు యాత్ర వద్దని చెప్పలేదనీ, తామే వద్దని నచ్చజెప్పామని ఆమె వివరించారు. జగన్ సేవలు పార్టీకి అవసరమని మంత్రి చెప్పారు.

No comments:

Post a Comment