జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Saturday, July 17, 2010

కీలక మలుపు * సర్దుకుపోదాం..రా.. ! * సామాజికవర్గాల సమీకరణం * 'ఓదార్పు' యాత్రలో యువ నాయకత్వం!

 కీలక మలుపు
జిల్లాలో కడప ఎంపీ జగన్‌మోహనరెడ్డి నిర్వహిస్తున్న ఓదార్పుయాత్ర అయిదోరోజుకు చేరుకుంది. అనూహ్యంగా శుక్రవారం రాత్రి సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సామర్లకోటలో జగన్‌ను కలిశారు. దీంతో యాత్ర కీలక మలుపు తిరిగింది. బోస్ చేరికతో జగన్ బలం పుంజుకున్నట్టయింది. ఇప్పటికే తుని ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు, జగ్గంపేట ఎమ్మెల్యే తోట నరసింహం తమ తమ నియోజకవర్గాల్లో జగన్ వెంట ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు.

రంపచోడవరం ఎమ్మెల్యే సత్యనారాయణరెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకు ఓదార్పు యాత్రకు దూరంగా ఉన్నారు. జిల్లాలో ఓదార్పు యాత్ర ముగిసే వరకు జగన్ వెంట బోస్ పర్యటించనున్నారు. గురువారం రాత్రి కిర్లంపూడిలో బసచేసిన జగన్ శుక్రవారం ఉదయం దివిలి నుంచి పర్యటన ప్రారంభించారు. పిఠాపురం, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఏటిపట్టు గ్రామాల్లో యాత్ర కొనసాగించారు. తొలుత పిఠాపురం మండలం మంగితుర్తిలో యర్రవరపు రాజు కుటుంబాన్ని ఓదార్చారు.

విరవ, విరవాడ, మల్లాం, ఫకృద్దీన్‌పాలెం, కొత్త కందరాడల్లో యాత్ర కొనసాగించారు. సామర్లకోట మండలం చంద్రంపల్లి, నవర, పి.వేమవరం, ఉండూరుల్లో పర్యటించారు. కొత్త కందరాడలో ఎ.సుబ్బారావు కుటుంబాన్ని, చంద్రంపాలెంలో దమ్మాల చక్రం కుటుంబాన్ని, ఉండూరులో జి.వీర్రాజు కుటుంబాన్ని ఓదార్చారు.

సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో కూడా జగన్ పర్యటించారు. మల్లాం, విరవాడ, ఫకృద్దీన్‌పాలెం, చంద్రంపాలెం, పి.వేమవరం, సామర్లకోట, పెద్దాపురం తదితర చోట్ల వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ముక్తసరిగా మాట్లాడారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు తాను ప్రాధాన్య మిస్తున్నట్టు జగన్ తెలిపారు. తన యాత్రలో భాగంగా ముఖ్యనేతల ఇళ్లకు వెళ్లి మంతనాలు జరిపే కార్యక్రమా లను జగన్ కొనసాగిస్తున్నారు.

కిర్లంపూడిలో మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం ఇంట్లో బసచేసిన ఆయన శుక్రవారం ఉదయం వీరవరం వెళ్లి జగ్గంపేట ఎమ్మెల్యే తోట నరసింహం ఇంట్లో అల్పాహారం తీసుకున్నారు. యాత్రలో భాగంగా మధ్యాహ్నం విరవాడలో పిఠాపురం మండల పరిషత్ అధ్యక్షుడు రాంబాబు ఇంట్లో భోజనం చేశారు. రెండుచోట్ల చాలాసేపు జగన్ గడపడం విశేషం. జగన్‌ను కలిసేందుకు జిల్లా కాంగ్రెస్ నేతలు పలువురు కిర్లంపూడి వచ్చారు. మాజీ మంత్రి సంగీత వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిక్కిన కృష్ణార్జునచౌదరి, వడ్డి వీరభద్రరావు తదితరులు జగన్‌ను కలిపారు. మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యేలు తోట గోపాలకృష్ణ, వరుపుల సుబ్బారావు జగన్ వెంట యాత్రలో పాల్గొన్నారు.

శాసనమండలి సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి (వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు) కిర్లంపూడి వచ్చి జగన్‌ను పరామర్శించారు. పిఠాపురం మండలం ఫకృద్దీన్‌పాలెంలో జగన్‌ను కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే సత్యవతి ఓదార్పుయాత్రకు సంఘీభావం తెలిపారు. గ్రూపు రాజకీయాల కారణంగా ఒకరిద్దరు నేతలు మౌనంగా ఉన్నప్పటికీ పిఠాపురం, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు జగన్ యాత్రలో పాల్గొనడం గమనించాల్సిన విషయం.
జిల్లాలో బలమైన సామాజికవర్గాలకు చెందిన నేతలను సమీకరించేందుకు జగన్ తాపత్రయపడుతున్నారు. ఇందులో భాగంగానే తొలుత ఏడు రోజులు నిర్వహించాలని భావించిన 'ఓదార్పు' యాత్రను పొడిగించనున్నట్టు తెలుస్తోంది. కోనసీమకు చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రులు జక్కంపూడి రామ్మోహనరావు, ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే తోట గోపాలకృష్ణ జిల్లాలో బలమైన సామా జికవర్గాలకు చెందిన నేతలుగా వున్నారు.

జిల్లా రాజకీయాల్లో సామా జికవర్గాలను బేరీజు వేసుకునే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో టికెట్లు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ సామాజికవర్గ రాజకీయాలకు ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 'ఓదార్పు' యాత్ర నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి త నయుడు, కడప ఎంపీ జగన్ కూడా రాజకీయంగా బలమైన ముద్ర వేసుకునేందుకు తన వెనుక బలమైన సామాజికవర్గ నేతలు ఉన్నారన్న సంకేతాలు పంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

జిల్లా కాంగ్రెస్ పార్టీలో జగన్ ఇప్పటికే మెజార్టీ నేతల మద్దతు కూడగట్టుకోగలిగారు. పదకొండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇంచుమించు అందరూ జగన్‌కు అనుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ముగ్గురు ఎంపీల్లో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇప్పటికే జిల్లాకు వచ్చిన జగన్‌ను పలకరించారు. కాకినాడ ఎంపీ పళ్లంరాజు జగన్ ఓదార్పుపై, ఆయన రాజకీయ వ్యవహారాలపై మౌనం వహిస్తున్నారు. అ మలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్, జగన్ ఎంపీ కాకముందు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్షకుమార్ సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్‌కు అనుకూలంగా బహిరంగంగానే మాట్లాడుతున్నారు.

జిల్లాలో మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అధిష్ఠానం వార్నింగ్ ఇచ్చినా జగన్ వెంటే ఉంటానని ముందు నుంచీ స్పష్టం చేస్తూ వస్తున్నారు. బోస్‌కు బలమైన సామాజికవర్గ నేపథ్యం ఉంది. జిల్లా రాజకీయాల్లో ఆరు దశాబ్దాలుగా కీలకపాత్ర పోషిస్తున్న సామా జికవర్గానికి చెందిన మాజీ మంత్రులు జక్కంపూడి రామ్మోహనరావు, ముద్రగడ పద్మనాభం కూడా జగన్‌కు అండగా నిలబ డ్డారు.

వీరితో పాటు పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే తోట గోపాల కృష్ణ, జగ్గంపేట ఎమ్మెల్యే తోట నరసింహం తదితరులు కూడా జగన్‌కు మద్దతు తెలుపుతున్నారు. దీంతో జగన్ పలువురు నేతల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

'ఓదార్పు' యాత్రలో యువ నాయకత్వం!

 దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డి చేపడుతున్న ఓదార్పు యాత్ర ఏర్పాట్లు చేయడంలో యువనాయకత్వం తాజాగా తెరపైకి వస్తుంది. ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, తనయులు, యువనాయకులు జగన్మోహన్‌రెడ్డి యాత్ర ఏర్పాట్లలో సీనియర్లను సైతం పక్కన పెట్టి ముందడుగు వేస్తున్నారు. దీనికి తోడు జగన్మోహన్‌రెడ్డితో వైఎస్ఆర్ విగ్రహాలు ఆవిష్కరించాలన్న అభిమానుల అత్యుత్సాహం అనేక చోట్ల వివాదాలకు ఆజ్యం పోస్తుంది.

పబ్లిక్ స్థలాల్లోను, అభ్యంతరకరమైన ప్రదేశాల్లోను, ముఖ్యంగా భవిష్యత్‌లో ఆయా ప్రాంతాల అభివృద్ధికి నిరోధకంగా మారే చోట్ల వైఎస్ విగ్రహాలను కాంగ్రెస్ నాయకులు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఐదవ నెంబరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పోలీస్‌స్టేషన్ వద్దే దివంగత నేత వైఎస్ఆర్, మాజీ ఎమ్మెల్యే చిర్ల సోమసుందరరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. అయితే రాజకీయ వివాదాల నేపథ్యంలో పోలీసులు సైతం అక్కడ పెట్టే విగ్రహాల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న విషయం మరింత వివాదమవుతుంది.

అదే రీతిలో అమలాపురంలోని హైస్కూల్ సెంటర్‌లో 214 జాతీయ రహదారి మధ్యలో భారీ స్థూపాన్ని నిర్మించి విగ్రహ ఏర్పాట్లకు మంత్రి విశ్వరూప్ అనుచర గణం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే సెంటర్‌లో వెలుగునిచ్చే ఐ-మ్యాక్స్ లైట్లను తొలగించి విగ్రహం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భవిష్యత్‌లో పాశర్లపూడి-బోడసకుర్రు వంతెన పూర్తయితే ఈ సెంటర్‌లో నిర్మించిన వైఎస్ విగ్రహం ప్రధాన సమస్యగా మారే అవకాశముందని జాతీయ రహదారుల శాఖ అధికారులు లోలోపలే మదనపడుతున్నారు. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహం సమీపాన వైఎస్ విగ్రహా ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ నాయకులు చర్యలను ఆ ప్రాంత దళితులు అడ్డుకోవడం ద్వారా నిలిచిపోయింది.

అదే విధంగా చల్లపల్లి శివారు బొండాడిపేటలో వైఎస్ జగన్‌తో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని పలువురు కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రతిపాదనను మరికొందరు దళిత నాయకులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వివాదం ప్రారంభమైంది. అదే రీతిలో కొత్తపేట, ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాల పరిధిలో రహదారుల చెంత కాంగ్రెస్ పార్టీ అధికారులు నిర్మిస్తున్న వైఎస్ఆర్ విగ్రహాలు భవిష్యత్‌లో వివాదాస్పదం కానున్నాయి.

ప్రస్తుతం నెలకొల్పుతున్న విగ్రహాల చెంతనే దివంగత తెలుగుదేశం నేత ఎన్టీఆర్‌తో పాటు దళిత నాయకుల విగ్రహాలను ఆయా కూడళ్లలో ఏర్పాటు చేయడానికి ప్రత్యర్థులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కోనసీమలో వేలాది విగ్రహాలు ఉన్న తరుణంలో వైఎస్ఆర్ విగ్రహాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం వల్ల కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదాలకు నాంది పలికే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

యువ నాయకత్వం హడావుడి:
జగన్ కోనసీమ పర్యటన నేపథ్యంలో కొత్త తరం యువజన కాంగ్రెస్ నాయకులు హడావుడి చేస్తున్నారు. భారీగా తమతమ ఫొటోలతో జగన్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణార్జున రెడ్డి జగన్ యాత్ర ఏర్పాట్లలో అనుచర గణంతో బిజీగా ఉన్నారు. మంత్రి తనయుడు సెంటర్‌లో ఓ భారీ ఫ్లెక్స్‌ను ఏర్పాటుచేశారు. అదే రీతిలో కాంగ్రెస్ నాయకుని తనయుడు కె.మదన్ భారీ ఫ్లెక్స్‌బోర్డును ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏర్పాట్లకు దూరంగా ఉన్న గన్నవరం నియోజకవర్గ నాయకులు జగన్ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. అలాగే చిర్ల జగ్గిరెడ్డి, కేవీ సత్యనారాయణరెడ్డిలు కొత్తపేట నియోజక వర్గంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
సర్దుకుపోదాం..రా.. !
jagan-delhi
రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న ఉత్కంఠ పరిణామాలు కొత్త మలుపు తిరిగాయి. ఇంతవరకూ అధిష్ఠానాన్ని ధిక్కరిం చి ఓదార్పు యాత్రలో ఉన్న కడప ఎంపీ వైఎస్‌ జగన్‌పై చర్యలు ఉంటాయని భావిస్తూ వచ్చిన వారి అంచనాలు తారుమారయ్యాయి. ఆయనపై ఎలాంటి చర్యలూ ఉం డవని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జీ వీరప్ప మొయిలీ అధికారికంగా ప్రకటించడంతో కాంగ్రెస్‌ రాజకీయాల వేడి ప్రస్తుతానికి చల్లారే సూచనలు కనిపి స్తున్నాయి.

శుక్రవారం నగరానికి వచ్చిన మొయిలీ.. ఓదార్పు యాత్ర జగన్‌ వ్యక్తిగత వ్యవహారమయినందున, ఆయ నపై ఎలాంటి చర్యలూ ఉండవని స్పష్టం చేయడం పరిశీ లిస్తే.. జగన్‌పై అధిష్ఠానం వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. జగన్‌ ఓదార్పు యాత్రలో కాంగ్రెస్‌ ద్వితీయ శ్రేణి నేతలే ఎక్కువగా రావడం, వారంతా జగ న్‌ పార్టీ పెడితే వెళ్లిపోతామంటూ విస్పష్టంగా ప్రకటించ డం, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అధిష్ఠానం మాట ను ఖాతరు చేసే పరిస్థితి కనిపించకపోవడం వంటి అం శాలను నాయకత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

SONజగన్‌ యాత్రకు వచ్చిన జాతీయ మీడి యా ప్రతినిధుల ద్వారా క్షేత్రస్థాయి సమాచారం తెలు సుకున్న అధిష్ఠానం, వాటిని పరిగణనలోకి తీసుకున్న ట్లు కనిపిస్తోంది. అయితే, జగన్‌పై అటు కఠినంగా వ్యవహరించకుండా, ఇటు మరీ జారిపోకుండా ఉండే లా వ్యూహం రూపొంది స్తున్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తు న్నాయి. జగన్‌ తనంత ట తాను పార్టీ నుంచి బయటకు వెళ్లే వరకూ అతడిని రెచ్చకొట్టకూడదని, యాత్ర వ్యవ హారంపై మరీ ప్రతిష్ఠకు పోకుండా చూసీ చూడనట్లు వ్యవహరించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు మారిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

జగన్‌ వెంట ఆశించి నంత సంఖ్యలో ఎమ్మెల్యే, ఎంపీలు వెళ్లకపోయినా.. పార్టీకి పునాదిరాళ్లయిన ద్వితీయ శ్రేణి నేతలు జగన్‌ వైపు కదులుతుండటంపైనే నాయకత్వం ప్రధానంగా దృష్టి సారించి, తన వైఖరిని తాత్కాలికంగా మార్చుకున్న ట్లు తెలుస్తోంది. వైఎస్‌ మృతి చెందిన తర్వాత జనాకర్ష క శక్తి ఉన్న నేత పార్టీలో ఎవరూ లేకపోవడం, ప్రస్తుతా నికి జగన్‌ ఒక్కరే ప్రత్యామ్నాయ జనాకర్షక శక్తి ఉన్న నేతగా కనిపిస్తుండటంతో.. జగన్‌ వ్యవహారాన్ని తెగేదా కా లాగి, రెచ్చగొట్టడం వల్ల పార్టీకే నష్టమన్న భావనతో నాయకత్వం మనసు మార్చుకున్నట్లు పార్టీ వర్గాలు విశ్లే షిస్తున్నాయి.

MOHILI యువకుడయి నందున జగన్‌ను ఎంత రెచ్చగొడితే అంత రెచ్చిపోయే ప్రమాదం ఉందన్నదీ అధి ష్ఠానం గ్రహించినట్లు కనిపి స్తోంది. ఇన్ని కారణాలు సమీక్షించుకున్న తర్వాతనే జగన్‌ యాత్రపై చూసీ చూడ నట్లు వదిలేయాలని నిర్ణయించింది. జగన్‌ యాత్రలో ద్వితీయ శ్రేణి నేతలు అధికంగా ఉన్న విషయాన్ని గ్ర హించిన నాయకత్వం.. వారు బయటకు వెళితే పార్టీకే నష్టమని, ఇప్పటికే ఎమ్మెల్యేలు అభ ద్రతాభావంతో ఉన్న వాస్తవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. ద్వితీ య శ్రేణి నేతలు జారిపోతారన్న భయంతోనే ఎమ్మెల్యే లు యాత్రకు వెళుతున్న అనివార్య, అయోమయ పరిస్థి తి నుంచి ఎమ్మెల్యేలను బయట పడవేసేందుకే అధిష్ఠా నం జగన్‌కు ప్రస్తుతానికి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సోనియాకు సీనియర్లే తప్పుదోవ వట్టించారు

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రపై యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని కొంత మంది సీనియర్లే తప్పుదోవ పట్టించా రని కడప ఎమ్మెల్సీ వైఎస్ వివేకానంద రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ప్రముఖ శిల్పి వడయార్ శిల్పకళాశా లకు విచ్చేసి పులివెందులలో ఏర్పాటు చేసేందుకు తయారు చేస్తున్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 18 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన పరిశీలించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ జగన్ ఓదార్పు యాత్ర కాంగ్రెస్ పార్టీ తరఫున చేపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమ య్యేదన్నారు. వైఎస్ కుటుంబం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడిందని పేర్కొన్నారు. ఓదార్పు యాత్ర విషయంలో కొందరు సీనియర్లు కావాలనే అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.

అయితే ఓదార్పు యాత్రతో జగన్ వేరే పార్టీ పెడతారని వస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికే తాము పాటుపడతామని వివేకానంద రెడ్డి స్పష్టం చేశారు. ఆయన వెంట కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కాంగ్రెస్ బ్లాక్ వన్ అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు, మాజీ ఏఎంసీ వైస్‌చైర్మన్ మార్గన గంగాధరరావు, రుద్రరాజు రవివర్మ తదితరులున్నారు. 

వ్యూహకర్తలెవరు? జగన్ పర్యటనపై ఇంటెలిజెన్స్ ఆరా

జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వ హస్తున్న కడప ఎంపీ వైఎస్ జగన్మో హనరెడ్డి వెనుక వ్యూహకర్తలు ఎవర న్న అంశంపై ఇంటెలిజెన్స్ అధికారు లు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశే ఖరరెడ్డికి అత్యంత ఆదరణ చూపిన జిల్లాగా తూర్పు గోదావరి అంటే ఎన లేని అభిమానం. అదే రీతిలో ఆయన తనయుడు జగన్‌కు కూడా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బ్రహ్మ రథం పడుతున్నారు. జగన్ జిల్లాలో ఓదార్పు నిర్వహిస్తున్న సమయంలో నే అనేక పరిణామాలు చోటుచేసుకుం టున్నాయి.

వైఎస్‌కు అత్యంత అను యాయుడిగా పేరొందిన రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ జగన్ ను కలవడంపై అహ్మద్ పటేల్ వివర ణ అడిగినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఉండవల్లి, మరికొంత మంది కీలక నేతలు జగన్ ఓదార్పు లో పాల్గొనడానికి కాస్త ఇబ్బంది ప డుతున్నారు. ఇదే సమయంలో జగన్ 'ఓదార్పు'లో ప్రసంగాలను రూపొం దిస్తున్న నేతలు ఎవరు? తర్వాత పార్టీ పెడితే అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటి? వీటిని ఎవరు రూపొం దిస్తున్నారు? అనే కోణంలో ఇంటెలి జెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

జిల్లాలో జగన్ యాత్ర జరుగుతున్న ప్రాంతాలతో పాటు కాకి నాడ, రాజమండ్రి, అమలాపురం లో క్‌సభ స్థానాల వారీగా జగన్‌కు అను కూలంగా వున్న నేతల వివరాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. జగన్ కు సన్నిహితుడిగా పేరొందిన కాకినా డ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, నల్లమిల్లి శేషారెడ్డి, మాజీ మంత్రులు జక్కంపూడి రామ్మోహనరావు,

ముద్ర గడ పద్మనాభం వంటి నేతలు జగన్ పార్టీ పెడితే బలమైన వర్గంగా తయా రవుతారన్న కోణంలో కూడా ఇంటెలి జెన్స్ సమాచారం సేకరిస్తున్నట్టు చె ప్తున్నారు. జగన్ పార్టీ ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కీలక నేతల్లో ఎవరెవరు యువ నేత వెంట నిలబడతారు? వ్యతిరేక వర్గంలో ఉంటారు అన్న అంశంపైనా చర్చ జరుగుతోంది.

No comments:

Post a Comment