జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Saturday, July 10, 2010

'ఓదార్పు' లో వైయస్ జగన్ సెంటిమెంట్ కు కళ్ళనీళ్ళు పెడుతున్న జనం

నరసన్నపేట (శ్రీకాకుళం జిల్లా): జగన్ యాత్రకు మంచి స్పందన కనిపిస్తోంది. ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్‌ జగన్ శుక్రవారం నరసన్నపేటలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి [^] విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 'నాన్న చనిపోతూ ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయారు. ఇంత పెద్ద కుటుంబంలో నన్ను ఒక కొడుకుగా దీవిస్తున్నారు, తమ్ముడిలా ఆదరిస్తున్నారు.


మీ గుండెల్లో నాన్న ఉన్నాడు కాబట్టే మీరు ఆదరణ ఆప్యాయతలు చూపిస్తున్నారు.' అంటూ జగన్‌ ప్రసంగించారు. ఆయన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారందరికి జగన్‌ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

No comments:

Post a Comment