జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Sunday, July 18, 2010

జగన్‌కు ఓదార్పు * మీ ఆప్యాయత అపారం ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ వ్యాఖ్య * హైకమాండ్ కొరడా * కడప ఎంపీ విధేయుడు రాంబాబుపై తొలిదెబ్బ* జగన్ వర్గంలో కలవరం సన్నిహితులతో కడప ఎంపీ మంతనాలు

 
 జగన్‌కు ఓదార్పు
'జగన్‌పై చర్యలు తీసుకోం.. ఓదార్పు యాత్ర ఆయన వ్యక్తిగతమైనది.' అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీర ప్ప మొయిలీ తేల్చి చెప్పడం జగన్ వర్గానికి ఊరటనిచ్చింది. 'ఓదార్పు'లో పాల్గొంటే అధిష్ఠానం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భావించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకుల్లో చాలా మంది శనివారం జరిగిన ఆరో రోజు యాత్రలో పాల్గొన్నారు. దీంతో జగన్ వర్గంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మొయిలీ ప్రకటనలో జగన్‌కు నేతల 'ఓదార్పు' ఎక్కువైంది. రాజమండ్రి ఆర్అండ్‌బీ అతిథిగృహం నుంచి శనివారం ఉదయం పది గంటలకు బయలుదేరిన జగన్ సాయంత్రం ఐదు గంటల వరకు రాజమండ్రి నగరంలోనే పర్యటించారు. లాలాచెరువు, క్వారీ మార్కెట్, మోరంపూ డిలలో వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించిన జగన్ పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.

నేను ఒంటరిని కాదు
'నేను ఒంటరివాడైపోయాడ నుకుంటున్నారు.. ఇంత మంది అభిమానం ఉన్న జగన్ ఒంటరివాడెలా అవుతాడు. ఇంత ఆత్మీ యాను రాగాలు పంచుతున్న మీ అందరూ నా వెంటే వుంటే ఒం టరినెలా అవుతాను' అంటూ జగన్ ఉద్వే గంగా మాట్లాడారు. మీరంతా నా తండ్రి రాజశేఖరరెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారు. నన్ను తమ్ముడిగా, అన్నగా, కొడుకుగా ఆదరిస్తున్న మీ అందరికీ రుణపడి ఉన్నానన్నారు.

ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని భయపడకుండా చాలా మంది నేతలు నా వెంట వస్తున్నారు. ఎవరూ ఎవరికీ భయప డాల్సిన అవసరం లేదు.. మీరంతా నా వెంట ఉండటం నాకు కొండంత బలాన్నిస్తోందని జగన్ చెప్పుకొచ్చారు. తనను రాజమండ్రి లోనూ, తూర్పుగోదావరి జిల్లాలోనూ ఎంతగానో ఆదరిస్తున్నారని క్వారీ మార్కెట్‌సెంటర్‌లో జరిగిన సభలో జగన్ చెప్పారు.

జక్కంపూడికి పరామర్శ
ఉదయం 10.30 గంటకు మాజీ మం త్రి జక్కంపూడి రామ్మోహనరావును పరామర్శించేందుకు జగన్ ఆయన ఇంటికి వెళ్లారు. మంత్రి బోస్, జక్కం పూడి విజయలక్ష్మి, జక్కంపూడి రాజా, గణేష్‌లు జగన్‌ను గజమాలతో స్వాగ తించారు. ఈ సందర్భంగా జై జగన్, జై వైస్సార్ అంటూ నినాదాలు చేశా రు. సుమారు అరగంట సేపు గడిపిన జగన్ జక్కంపూడి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇటీవల ఆరోగ్యం కాస్త మెరు గుపడిందని జక్కంపూడి కుటుంబ సభ్యులు జగన్‌కు వివరించారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తాకిడి
జగన్ ఓదార్పు యాత్ర ఆయన వ్యక్తి గతం.. అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ చేసిన ప్రకటనతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగంగా యాత్రలో పాల్గొనేం దుకు ఉత్సాహం చూపారు. జిల్లాకు చెందినరాజమండ్రి సిటీ, అనపర్తి, గన్నవరం ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్ర కాశరావు, నల్లమిల్లి శేషారెడ్డి, పాముల రాజేశ్వరీదేవిలతో పాటురైల్వేకోడూ రు, రాజంపేట, ఏలూరు ఎమ్మెల్యేలు కె.శ్రీనివాసులు, అమర నాథ రెడ్డి, ఆళ్ల నాని, ఎమ్మెల్సీలు కందుల దుర్గేష్, చైతన్యరాజు, పుల్లా పద్మావతి యాత్ర లో హుషారుగా పాల్గొన్నారు.


నాలుగు కుటుంబాలకు ఓదార్పు
ఓదార్పు యాత్రలో భాగంగా శని వారం రాజమండ్రిలో జగన్ నాలుగు కుటుంబాలను కలసి ఓదార్చారు. ఏవి అప్పారావు రోడ్ ఏరియాలో రెడ్డి సూ ర్యప్రకాశరావు, గంజి శేఖర్, అన్న పూర్ణ మ్మపేటకు చెందిన ఆగురి నరసింహమూర్తి, నా రాయణపురానికి చెందిన బొడ్డు ప్రసాదరావుల కుటుం బాలను జగన్ పరామర్శించి ఓదార్చా రు.ఆయా కుటుంబాల వా రితో జగ న్ రెండు గంటలసేపు గడిపారు. కుటుంబ సభ్యుల పరిస్థితి, ఆర్థిక స్థితిగతులపైనా ఆరా తీసిన జగన్ ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. సాయంత్రం ఆరు గంటలకు మోరంపూడి సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్ అక్కడి నుంచి దివాన్‌చెరువు వెళ్లి మా గాపు ధర్మయ్య కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత నరేంద్ర పురం, రాజానగరం చేరుకుని వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు.
మీ ఆప్యాయత అపారం 
ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ వ్యాఖ్య
ఎవరో ఏదో చేస్తారని భయపడకుండా
నాకు అండగా ఉన్నారు
ఆరో రోజు ఐదుగురికి పరామర్శ
ఓ పక్క ఓదార్పు మరో పక్క రహస్య చర్చలు
మొయిలీ వ్యాఖ్యల తర్వాత పెరుగుతున్న మద్దతు

"ఎవరో ఏదో చేస్తారని భయపడకుండా..మీ రంతా నాకు అండగా నిలబడుతున్నారు. ఇంతటి ఆప్యాయత చూపుతున్న మీ అందరికీ కృతజ్ఞతలు'' అని కడప ఎంపీ జగన్ అన్నారు.

రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి విజయలక్ష్మిలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు కాగా,తూర్పు గోదావరి జిల్లాలో ఆరోరోజు యాత్రలో భాగంగా శనివారం ఐదు కుటుంబాలను పరామర్శించారు. పలుచోట్ల వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు.


ఉండవల్లితో మంతనాలు
యాత్రలో భాగంగా శనివారం రాజమండ్రి వచ్చిన జగన్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇంటికి వెళ్లి సుమారు అరగంటసేపు ఉన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య కీలక రాజకీయ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి జక్కంపూడి ఇంటికి వెళ్లిన జగన్ ఆయనతోనూ రహస్య చర్చలు జరిపారు.

సీమ,తెలంగాణ ఎమ్మెల్యేలతో..
యాత్ర వద్దని ఇప్పటి వరకు స్పష్టం చేసిన అధిష్ఠానం కాస్త మెత్తబడినట్లు కనిపించడం, ఓదార్పు యాత్ర ఆయన వ్యక్తిగతమని, జగన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మొయిలీ వ్యాఖ్యానించడంతో ఆయనకు మద్దతు పెరుగుతోంది. రాయలసీమ, తెలంగాణ జి ల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు జగన్‌తో మంతనాలు జరపడానికి రాజమండ్రి చేరుకున్నారు.

కడప నుంచి మేయర్..
జగన్ యాత్రకు కడప జిల్లా నుంచి మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డితోపాటు రాజంపేట ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కేశ్రీనివాసులు వచ్చారు.

అనంత నుంచి ఇద్దరు..
ఓదార్పు యాత్రలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే బి.గురునాథ్‌రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

కర్నూలు నుంచి...
ప్రజారాజ్యం పార్టీ నేత, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి రాజమండ్రి నుంచి యాత్రను అనుసరిస్తుండగా.. కాంగ్రెస్ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి గడచిన నాలుగు రోజులుగా జగన్ వెంట ఉన్నారు. మంత్రి శిల్పామోహన్‌రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి రెండు రోజులు పాల్గొని శుక్రవారం వెళ్లిపోయారు. కర్నూలు మార్కెట్ యార్డు చైర్మన్ వెంకటేశ్వర్లు కూడా యాత్రలో పాల్గొని శుక్రవారం కర్నూలు చేరుకున్నారు.

వైఎస్ కుటుంబంతోనే..: మంత్రి బోస్
తాను రాజకీయాలలో ఉన్నంత వరకు వైఎస్ కుటుంబంతోనే ఉంటానని మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్పష్టం చేశారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన వైఎస్‌కు కృతజ్ఞతగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పారు.

అధిష్ఠానానికి తెలిసొచ్చింది: కడప మేయర్
ఎవరు ఎంత చెప్పినా.. ప్రజాదరణ కలిగిన నేత ఎవరో అధిష్ఠానానికి ఇప్పుడు తెలిసిందని, వీరప్ప మొయిలీ తాజా ప్రకటనే ఇందుకు నిదర్శనమని కడప మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్
తక్షణం అమల్లోకి ప్రకటించిన మొయిలీ
సోనియా ఆగ్రహం ఫలితమే
జగన్‌పై చర్యలేదన్న వీరప్పకు క్లాస్ తీసుకున్న అహ్మద్ పటేల్
జగన్ వర్గీయుల వివరాలు అందజేయాలి
నేతలను ఓదార్పునకు దూరంగా ఉంచాలి
మొయిలీపైనే బాధ్యత రోశయ్యకు మేడమ్ పిలుపు
  కాంగ్రెస్ అధిష్ఠానం కొరడా ఝళిపించడం మొదలు పెట్టింది! కడప ఎంపీ జగన్ మోహన్‌రెడ్డి శిబిరంపై తొలి దెబ్బ పడింది! ముఖ్యమంత్రి రోశయ్యను అనరాని మాటలంటూ.. అసభ్య సవాళ్లు విసిరిన జగన్ విధేయుడు అంబటి రాంబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

జగన్‌కు అనుకూలంగా ఉంటారన్న ముద్ర ఉన్న వీరప్ప మొయిలీకి అంతకు కొద్ది గంటల ముందే గట్టిగా క్లాస్ తీసుకుంది. అంతేకాక.. ఆయన నోటితోనే జగన్ వర్గంపై తొలి చర్యను ప్రకటింపచేసింది. ఓదార్పు యాత్రకు దూరంగా ఉండాలంటూ సంకేతాలు పంపాలని మొయిలీని ఆదేశించిన అధిష్ఠానం.. జగన్ వర్గీయుల జాబితా.. వారి నేపథ్యాల వివరాలను అందజేసే బాధ్యతనూ ఆయనకే అప్పగించింది.

ఈ వ్యవహారాలన్నింటినీ చర్చించేందుకు హస్తిన రావాలంటూ రోశయ్యకు కబురు పంపింది. అంతకుముందు ఓదార్పుపై మొయిలీ శుక్రవారం చేసిన వ్యాఖ్యలతో.. యాత్రలో పాల్గొనే నేతల సంఖ్య పెరిగింది. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు జగన్ యాత్రలో శనివారం పాల్గొన్నారు.

ఆ ఉత్సాహంలో "ఎవరో ఏదో చేస్తారని భయపడకుండా మీరంతా నాకు అండగా నిలబడుతున్నారు. ఇంతటి ఆప్యాయత చూపుతున్నందుకు అందరికీ కృతజ్ఞతలు'' అని ఆ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెప్పిన కడప ఎంపీ.. సాయంత్రానికి అధిష్ఠానం విసిరిన కొరడా దెబ్బకు కంగు తిన్నారు. యాత్ర మధ్యలోనే ఒక చోట కారు తన సన్నిహితులతో మంతనాలు జరిపారు.

జగన్‌పై చర్యలు ఉండవన్న మొయిలీకి అధిష్ఠానం క్లాస్ తీసుకున్న గంటల వ్యవధిలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనకు తన అనుయాయులకు ఏం భయం లేదని జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా అధిష్ఠానం తీవ్రంగా పరిగణించిందని తెలుస్తోంది. జగన్‌పై క్రమశిక్షణ చర్యల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తరుణంలో మొయిలీ ఈ వ్యాఖ్యలు చేయడం అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించింది.

దాంతో గతంలో మాదిరిగానే ఆయనతోనే నష్టనివారణ చర్యలు చేపట్టింది. దీంతో తన నిష్పాక్షికతను నిరూపించుకునేందుకన్నట్లు.. రాంబాబుపై వేటు వేస్తూ పీసీసీకి మొయిలీ ఉత్తర్వులు పంపారు. కాగా.. తనకు సస్పెన్షన్ ఉత్తర్వులు అందలేదని అంబటి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చెప్పారు. అధికారికంగా సమాచారం వచ్చాక స్పందిస్తానన్నారు.

ఎందుకలా చెప్పారు?
ఓదార్పు యాత్ర జగన్ వ్యక్తిగతమని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఉండవని వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించడాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సీనియర్ నేతలతో చర్చిస్తున్న సమయంలో ఈ ప్రస్తావన వచ్చిప్పుడు సోనియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఎందుకలా చెప్పారు? ఎవరిని అడిగి ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు? అంటూ మండిపడ్డారని ఆ వర్గాలు వివరించాయి.

ఆ వెంటనే సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్.. కేంద్ర న్యాయ మంత్రి వీరప్ప మొయిలీకి ఫోన్ చేసి, ఎందుకలా వ్యాఖ్యలు చేశారంటూ మందలించారని తెలిసింది. గతంలో ఒకసారి జగన్ విషయంలో అధిష్ఠానం నుంచి మొయిలీ అక్షింతలు వేయించుకున్నారు.

ఓదార్పు యాత్రకు అధిష్ఠానం సానుకూలంగా ఉందని తనతో మొయిలీ అన్నారని, ఆశీర్వదించి పంపారని జగన్ తన శ్రీకాకుళం యాత్రకు ముందు ఢిల్లీలో చెప్పారు. అయితే.. దానిపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేయడం.. అహ్మద్ పటేల్ తనకు ఫోన్ చేయడంతో సాయంత్రానికి మీడియా ముందుకు వచ్చిన మొయిలీ.. తాను జగన్‌కు అలా చెప్పలేదని వివరణ ఇచ్చుకున్నారు.

కాగా.. మరోసారి ఇదే విషయంలో మొయిలీ అధిష్ఠానం ఆగ్రహానికి గురి కావడం విశేషం. మొయిలీ వ్యాఖ్యలు జగన్ వర్గానికి ఆత్మ విశ్వాసం కలిగించాయని, ఇక ఓదార్పు యాత్రకు పార్టీ నేతలు నిర్భయంగా హాజరవుతారని, దీని వల్ల మళ్లీ రాజకీయ సమస్యలు ఏర్పడతాయని పార్టీ నేతలు ఒకరిద్దరు అధిష్ఠానం దృష్టికి తీసుకురావడంతో ఈ మందలింపు వ్యవహారం జరిగిందని తెలిసింది.

అంతేకాక.. ఓదార్పు యాత్రకు హాజరు కావద్దన్న స్పష్టమైన సంకేతాలు పార్టీ నేతలకు పంపే బాధ్యతను కూడా మొయిలీకే అప్పగించినట్లు సమాచారం. వీటితో పాటు.. జగన్ వర్గీయులైన ఎమ్మెల్యేల గురించి, వారి నేపథ్యం గురించి కూడా సరైన సమాచారం అందించాలని మొయిలీని అధినాయకత్వం కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

జగన్‌పై క్రమశిక్షణ చర్యలు ఉన్నా లేకపోయినా, ఆ విషయం బయటకు చెప్పనవసరం లేదని ఏఐసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అధిష్ఠానం అనుమతి లేకున్నా.. కడప ఎంపీ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయనపై చర్య తప్పకపోవచ్చని ఏఐసీసీ వర్గాలు ముందు నుంచి చెబుతూనే ఉన్నాయి.

కొంత సమయం వేచి చూసి.. ఆ తర్వాత తగిన చర్య తీసుకోవాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉందన్న సంకేతాలూ వచ్చాయి. అయితే.. శుక్రవారం నగర పర్యటనకు వచ్చిన వీరప్ప మొయిలీ.. జగన్ యాత్ర వ్యక్తిగతమని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఉండవని చేసిన వ్యాఖ్యలతో జగన్‌కు ఊరట లభించినట్లయింది. పలువురు ఎమ్మెల్యేలు జగన్ యాత్రలో చేరారు.

దీనిని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. జగన్ ఓదార్పు యాత్ర ఇంకా కొనసాగుతున్నందువల్ల ఆయన వ్యవహార శైలిని ఇంకా పరిశీలించాల్సి ఉన్నదని, ఆయన విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఇప్పుడే తొందరపడకూడదనే అభిప్రాయంతో అధిష్ఠానం ఉన్నదని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి.

అంత మాత్రాన జగన్ కార్యకలాపాలను పూర్తిగా ఉపేక్షించినట్లు భావించరాదని స్పష్టం చేస్తున్నాయి. కాగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని కలుసుకుని, రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై చర్చించారు. 

జగన్ వర్గంలో కలవరం
సన్నిహితులతో కడప ఎంపీ మంతనాలు

పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబుపై కాంగ్రెస్ అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేయడం కడప ఎంపీ వైఎస్ జగన్ వర్గానికి గట్టి షాక్‌నిచ్చింది. ఓదార్పు యాత్ర జగన్ వ్యక్తిగతమని, ఆయనపై క్రమశిక్షణ చర్యలన్నీ పత్రికల ఊహాజనితాలేననని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ ప్రకటించడంతో అంతా సద్దుమణిగిందని, పరిస్థితులన్నీ తమ 'దారి'కే వచ్చాయని జగన్ వర్గం భావిస్తున్న తరుణంలో.. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం ఆ వర్గాన్ని కలవరానికి గురి చేసింది.

జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా, దాదాపు ఆయన అధికార ప్రతినిధిగా మెలగుతున్న అంబటి రాంబాబు.. ఇటీవల రోశయ్యపై పరుషమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వాటిని రోశయ్య, డీఎస్‌లు తీవ్రంగా పరిగణించారు. అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. క్రమశిక్షణరాహిత్యాన్ని మొగ్గలోనే తుంచేయాలని అధిష్ఠానం ఆదేశించింది కూడా.

ఈ నేపథ్యంలోనే పీసీసీ క్రమశిక్షణ సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీసులతో కమిటీ ముందు హా జరైన అంబటి.. మరికొంత గడువు కోరారు. కమిటీ గడువు ఇచ్చింది కూడా. అయితే.. ఆ తర్వాత కూడా అంబటి ధిక్కార స్వరాన్నే వినిపించారు. దీంతో, అంబటి అంశాన్ని శుక్రవారం హైదరాబాద్ వచ్చిన మొయిలీకి పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ సత్యనారాయణరాజు ఓ నివేదికను సమర్పించారు.

అదేసమయంలో, ఓదార్పుపై మొయిలీ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీలో లక్ష్మణరేఖను దాటేవారి సంఖ్య అధికంగా ఉంటుందని అధిష్ఠానం ఆందోళన చెందింది. దీంతో ఈ వ్యవహారాన్ని మొగ్గలోనే తుంచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే.. సమాధానం చెప్పడానికి ఇంకా గడువు ఉన్నా అంబటిపై వేటు వేసింది. ఈ విషయాన్ని మొయిలీతోనే చెప్పించింది.

తద్వారా.. కిందిస్థాయి నుంచి ఇన్‌చార్జి వరకూ ఎవరు గీత దాటినా కఠినంగానే వ్యవహరిస్తామం టూ పరోక్షంగా మొయిలీకి కూడా అధిష్ఠానం హెచ్చరికలు పంపిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంబటిపై చర్యల ద్వారా.. భవిష్యత్తులో జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనే ప్రజాప్రతినిధులపైనా ఇదే వైఖరిని అవలంబించనున్నట్లు హెచ్చరికలను పంపిందని చెబుతున్నాయి.

అయితే, అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై తనవారిని కాపాడుకొనే విషయంలో వైఎస్ ఎప్పుడూ ముందుండేవారని.. ఆ యన తనయుడిగా ఇప్పుడు జగన్ ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి పార్టీలో నెలకొంది. అంబటిపై వేటు విషయం తెలిసిన వెంటనే.. ఓదార్పు యాత్రలో ఉన్న జగన్ తన సన్నిహితులు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నల్లమిల్లి శేషారెడ్డి, రాపాక వరప్రసాద్‌లతో శనివారం రాత్రి మంతనాలు జరిపారు.

రాజమండ్రి రూరల్ మండలంలోని నామవరంలో ఓదార్పు యాత్రకు బయలుదేరిన జగన్.. మార్గమధ్యలో కారు ఆపి ముగ్గురితోనూ ఐదు నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై కూలంకషంగా చర్చించినట్లు తెలిసింది.

No comments:

Post a Comment