జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Saturday, August 21, 2010

రాజకీయ రణరంగం హోరా... హోరీ

 jagan roshiah
రాష్ట్ర కాంగ్రెస్‌లో రెండు శిబిరాల మధ్య దాడి... ఎదురు దాడి జరుగుతోంది. ప్రత్యేకించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుమారుడు, కడప ఎంపి జగన్మోహన్‌రెడ్డి నిర్వహి స్తున్న ఓదార్పు యాత్ర ఈ రెండు శిబిరాల మధ్య యుద్ధ వాతావర ణానికి నాంది పలుకుతోంది. పార్టీ నేతలు జగన్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోరుు పోరు తీవ్రతరం చేశారు. పార్టీ అధిష్ఠానాన్నే లెక్క చేయని రీతిలో జగన్‌ వర్గం వ్యవహరిస్తుండగా, హైకమాండ్గ ఆదేశాలే మాకు శిరోధార్యమంటూ జగనే టార్గెట్‌గా వ్యతిరేక వర్గం ఎదురు దాడికి దిగు తున్నది. ఓదార్పు యాత్రే కాంగ్రెస్‌లో కల్లోలానికి దారి తీస్తున్నది. పార్టీ శ్రేణుల్లో అంతా అయోమయ పరిస్థితి నెలకొంది.

jaganఓదార్పు యాత్రపై కాంగ్రెస్‌ పార్టీలో ఇరు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది పరస్పర విమర్శలతో రాష్ట్ర రాజ కీయం వేడెక్కింది. ఇంత వరకూ యాత్రపైనే దృష్టి పెట్టిన జగన్‌ ఇప్పుడు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలపై దూకుడుగా వ్యవహరించడం ప్రారంభించారు. పార్టీలో తనను ఏకాకిని చేసేందుకు కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాలపై జగన్‌ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో నాలుగు జిల్లాల్లో ఓదార్పు యాత్ర పూర్తయిన తరుణంలో హైకమాండ్‌ ద్వారా ఎటూ అడుగు వేయలేని పరిస్థితి కల్పిస్తున్న నేతల పట్ల జగన్‌ భగ్గుమంటున్నారు. అధిష్ఠానాన్ని రంగంలో దించి తన యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే నేపంతో దగ్గుబాటి దంపతులపై జగన్‌, ఆయన వర్గం కారాలు, మిరియాలు నూరుతున్నది. వచ్చే నెల 3 నుంచి ప్రకాశం జిల్లాలో తన ఓదార్పు యాత్ర ప్రారంభం కానున్న తరుణంలో ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను, ఎంపీలను ఢిల్లీ పిలిపించుకుని హైకమాండ్‌తో సమావేశాలు ఏర్పాటు చేసిన దగ్గుబాటి దంపతులు, చివరకు సోనియా, అహ్మాద్‌పటేల్‌లను రంగంలోకి దింపి ఓదార్పు అడ్డుకునేందుకు ప్రయత్నిం చారంటూ జగన్‌, అతని వర్గానికి చెందిన నేతలు మండిపడుతు న్నారు.

పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఎవరు కూడా ఓదార్పు యాత్రకు వెళ్ళవద్దని సోనియా, అహ్మద్‌ పటేల్‌ చెప్పారంటూ కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఢిల్లీలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ తరువాత ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. మరో వైపు ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు కూడా జగన్‌ ఓదార్పు యాత్ర విషయంలో కామెంట్లు చేశారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో దగ్గుబాటి దంపతులు ఓదార్పు యాత్ర ఎపిసోడ్‌లో వ్యవహరించిన పాత్ర యువనేత జగన్‌కు అగ్రహాన్నే తెచ్చిపెట్టింది. ఆయన అనుచరగణం కూడా దగ్గుబాటి దంపతులపై ఎదురు దాడికి దిగారు.

roshiahజగన్‌ ఒక మరో అడుగు ముందుకు వేసి ఏకంగా దగ్గుబాటి దంపతులపై ఫిర్యాదు చేశారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరించే నేతలు, ప్రత్యేకించి ఓదార్పు విషయంలో ఆటంకాలకు ప్రయత్నించే వారి పట్ల తగిన రీతిలోనే స్పందిస్తామంటూ జగన్‌ ఈ ఫిర్యాదు ద్వారా సంకేతాలు అందించారు. ప్రకా శం జిల్లా ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకొచ్చి తనకు నీతులు చెప్పించే ప్రయత్నాలు చేయడం, అధిష్ఠానంతో ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు వ్యూహాలు రచించారంటూ దగ్గుబాటి దంపతులపై జగన్‌ నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జీ డాక్టర్‌ వీరప్ప మొయిలీ హస్తినాలో రాష్ట్ర ఎంపీలకు ఇచ్చిన విందులో కూడా జగన్‌ పట్టుపని పదినిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆయన ఆనకాపల్లి ఎంపి సబ్బం హరిని వెంటబెట్టుకుని కాంగ్రెస్‌లో కీలక నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు, కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఇంటికి వెళ్ళి కొంత సేపు ఆయనతో సమావేశ మయ్యారు. ఈ భేటి సారాంశమేమిటో అధికారికంగా వెల్లడించనప్పటికీ దగ్గుబాటి దంపతులు, ఓదార్పు యాత్ర విషయంలోనే జగన్‌, ప్రణబ్‌తో చర్చించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. హైదరాబాద్‌కు వచ్చే ముందు శుక్రవారం ఉదయం జగన్‌ మరో సారి ప్రణబ్‌తో భేటి అయ్యారు. ఆ తరువాత ఆయన సాయంత్రం వీరప్ప మొయిలీతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇద్దరు నేతల వద్ద కూడా దగ్గుబాటి దంపతుల వ్యవహార శైలీపై ఫిర్యాదు చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సోనియాగాంధీ తనకు చెప్పారంటూ పురంధేశ్వరి ప్రకటన చేసిన కొంత సేపటికే జగన్‌, ప్రణబ్‌ను కలువడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది.

ఇలా ఉండగా జగన్‌ వర్గం నేతలు కూడా దగ్గుబాటి దంపతుల నిప్పులు చెరుగుతున్నారు. ఓదార్పు యాత్ర విషయంలో పార్టీ అధిష్టానం ఏదైనా చెప్పా ల్సి ఉంటే నేరుగా జగన్‌నే పిలిపించి చెప్పవచ్చు, అలా కాకుండా తమతో సోనియా, పటేల్‌ చెప్పారంటూ దగ్గుబాటి దంపతులు జగన్‌ ఓదార్పు యాత్ర ను అడ్డుకునే రాజకీయాలు చేస్తున్నారంటూ పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అదే విధంగా జగన్‌ వర్గ నాయకు లుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్‌రావు, పార్టీ నేత గట్టురామచంద్ర రావు తది తరులు కూడా దగ్గుబాటి దంపతులపై చిందులు తొక్కారు.

ఎన్టీఆర్‌ను గద్దె దించడంలో కీలక పాత్ర వహించారంటూ దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు మండి పడ్డారు. మరో వైపు తిరుపతిలో ఉన్న జగన్‌ బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి కూడా ఓదార్పు విషయంలో పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్‌రావు అతిగా స్పందించారంటూ ఢిల్లీలో వారు వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో దగ్గుబాటి దంపతులు కీలక పాత్ర పోషించిన దాఖలాలు లేవని, పదవులు కాపాడుకోవడానికే కొందరు జగన్‌ను టార్గెట్‌ చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఇక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరో అడుగు ముందుకు వేసి మంత్రి పదవులు తనకు శాశ్వతం కాదని, అధిష్ఠానం వద్దన్నా తాను ఓదార్పు యాత్రకు వెళ్ళి తీరుతానని మరో సారి పునరుద్ఘాటించి జగన్‌కు విధేయతను ప్రకటించుకున్నారు.

ఎదురుదాడి....
ఇదిలా ఉండగా జగన్‌ వ్యతిరేక వర్గం అతనిపై ఎదురు దాడి ప్రారంభిం చింది. అధిష్ఠానం ఆదేశాలను సైతం లెక్క చేయకుండా, పార్టీని శాసించే స్థా యిలో జగన్‌ వ్యవహరిస్తున్న తీరుపై ఆ వర్గం కన్నెర్ర చేస్తున్నది. రోజు వారిగా జగన్‌పై విమర్శలు సంధిస్తున్న నేతలతో పాటు శుక్రవారం ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంత రావు తదితరులు జగన్‌ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా అతనిపై బాణాలు ఎక్కుపెట్టారు. ఈ ముగ్గురు నేతలు కూడా రాజీవ్‌ జయంతి వేడుకల కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని జగన్‌పై తమదైన శైలీలో మండిపడ్డారు. నిజమైన నాయకులు ఎవరూ కూడా పదవుల కోసం పాకులాడరంటూ ముఖ్య మంత్రి రోశయ్య చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి మాట్లాడిన వేనని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

అదే విధంగా పీసీసీ చీఫ్‌ డిఎస్‌ కూడా యుననేత జగన్‌పై గురిపెట్టి కొందరు నేతలు పార్టీలో కాలుమోపగానే పదవు ల కోసం పోటీ పడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, రాహుల్‌ గాంధీని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని హితవు పలికారు. మరో సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు విహెచ్‌, జగన్‌ పేరు ప్రస్తావించకుండానే నాడు రాజీవ్‌ గాంధీ ఆశీస్సుల వల్లే వైఎస్‌కు పీసీసీ అధ్యక్ష పదవి దక్కిందని, రాజీవ్‌ లేక పోతే వైఎస్‌కు ఆ పదవి వచ్చేదా? అని ప్రశ్నించారు. అంబేద్కర్‌ కాదు, గాంధీ కాదు, అంతా మా నాన్నేనని కొందరంటున్నారు, అది సరికాదు, పార్టీకి సేవచేయకుండా పదవులు ఎలా వస్తాయి? హైకమాండ్‌ను నమ్ముకుంటేనే పదవులు వస్తాయన్న విషయాన్ని అందరు గ్రహించాలని ఆయన జగన్‌కు చురకలంటించారు. మరో సీనియర్‌ నేత, మాజీ మంత్రి శంకర్‌రావు కూడా ఓదార్పు యాత్ర వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, జగన్‌ చుట్టు ఉన్న నేతలందరు నీళ్ళ తరహాలాంటి వారేనంటూ జగన్‌ వర్గంపై ధ్వజమెత్తారు.

No comments:

Post a Comment