జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Friday, August 13, 2010

ఓదార్పు జగన్‌ వ్యక్తిగతం... పార్టీ నేతలు పాల్గొనవద్దు... అధిష్టానం వైఖరి...


కడప నియోజకవర్గం ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్రపై మరోసారి కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌ అయ్యింది. ఓదార్పుయాత్ర జగన్‌ వ్యక్తిగతమని, పార్టీ నేతలు ఎవరూ ఆ యాత్రలో పాల్గొనవద్దని అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

అనుచరులతో జగన్ భేటీ...
వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి ఈరోజు ముఖ్య అనుచరులతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ రెండున తిరుపతిలో జరిగే వై.ఎస్. రాజశేఖర్‌రె డ్డి వర్ధంతి పోస్టర్లను జగన్ విడుదల చేశారు. కాంగ్రెస్ నేత టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ జనహృదయ నేత వైఎస్‌కు తిరుపతిలో చాలా మంది అభిమానులు ఉన్నారన్నారు.

ఈ సంస్మరణ సభలో 25వేల మందికి అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. అలాగే పలు కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. కొండా సురేఖ, అంబటి రాంబాబు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

హైకమాండ్ నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదు : బాలినేని

  కడప నియోజకవర్గం ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని హైకమాండ్ నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ మూడు నుంచి ప్రకాశం జిల్లాలో ప్రారంభమయ్యే జగన్ యాత్ర యధాతథంగా జరుగుతుందని అన్నారు. ఈ యాత్రంలో తాను పాల్గొంటున్నట్లు తెలిపారు. యాత్ర కోసం తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు మంత్రి బాలినేని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుండి జగన్ ను బయటికి పంపే కుట్ర : కొండా సురేఖ

శుక్రవారం ఉదయం ఆమె కడప ఎంపీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం సురేఖ మీడియాతో మాట్లాడుతూ పార్టీ నుంచి జగన్‌మోహన్‌రెడ్డిని బయటకు పంపే కుట్ర జరుగుతోందన్నారు. తనపై చర్య తీసుకుంటే, గతంలో వైఎస్‌పై విమర్శలు చేసిన వారికి ఎందుకు చర్యలు తీసుకోలేదని సురేఖ ప్రశ్నించారు. వైఎస్‌ను అభిమానించేవారిపై ఎందుకు కక్ష సాధిస్తున్నారో అర్థం కావటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment