జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, August 19, 2010

బాలినేనికి రోశయ్య ఫోన్...* ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దు, * జగన్ కుటుంబంతో నా అనుబంధం వేరు : * బాలినేని విరగడానికి సిద్ధంగా ఉన్న మూడో కొమ్మ


కడప నియోజకవర్గం ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని అధిష్టానం మాటగా ముఖ్యమంత్రి రోశయ్య గురువారంనాడు రాష్ట్ర గనులశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సూచించారు. హైకమాండ్‌ను ధిక్కరిస్తే పరిణామాలు భిన్నంగా ఉంటాయని కూడా ముఖ్యమంత్రి తెలిపారు. అయితే అందుకు సమాధానంగా తాను జగన్‌తోనే ఉంటానని ఎటువంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉన్నానని బాలినేని ధీటుగా సమాధానం చెప్పారు.

జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రోశయ్యకు తెలియజేశారు. తాను ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మాకుటుంబానికి, వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం రీత్యా ఓదార్పు యాత్రలో పొల్గొనదలచుకున్నానని స్పష్టం చేశారు.

అంతకు ముందు ముఖ్యమంత్రి రోశయ్య అధిష్టానం తరఫున రాష్ట్ర గనులశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేశారు. ప్రకాశంజిల్లాలో సెప్టెంబర్ మూడున జరగనున్న జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని సూచించారు. ఇది తనమాటకాదని హైకమాండ్ ఆదేశమని, దీనిని అందరూ పాటించాలని రోశయ్య తెలిపారు. అధిష్టానం ఓదార్పు యాత్రకు వ్యతిరేకంగా ఉందని, మీరు కూడా హైకమాండ్ మాట వింటే బాగుంటుందని అన్నారు. ఈ ఆదేశాలను ధిక్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా పేర్కొన్నారు.
జగన్‌ వెంటే నేను...పదవి శాశ్వతం కాదు : బాలినేని
ఆరు నూరైనా జగన్‌ వెంటే ఉంటానని, మంత్రి పదవి శాశ్వతం కాదని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్ఫష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాధరణ గల నేత, తన బందువు అయిన జగన్‌ తన జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తే వెళ్లలేకుండా ఉండలేనని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. పార్టీ పరంగా యాత్ర చేయాలన్న అధిష్టానం నిర్ణయం తనకు తెలియదని, ఆ విషయాన్ని ధృవీకరించుకున్న తరువాత జగన్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తానని బాలినేని తెలిపారు.

No comments:

Post a Comment