జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Sunday, August 22, 2010

కౌంట్‌డౌన్‌ ! * సెప్టెంబర్‌లో సంక్షోభమేనా?

Sonia-gandhi
కాంగ్రెస్‌లో ఇక ఇమడగలిగే పరిస్థితులు కనిపించటం లేదని నిర్ధారణకు వచ్చిన కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తు న్నారా? ఆ పార్టీకి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ పేరు కానీ, ఇందిరాగాంధీ పేరు కానీ ఖాయం చేయబోతున్నారా?...కాంగ్రెస్‌ వర్గాలలో ఆసక్తిరంగా సాగుతున్న చర్చ ఇది. పార్టీ నుంచి జగన్‌ పోతే పోనీ అని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ ఘాటైన వ్యాఖ్యలు చేసినా బెదరని జగన్‌ సోమ, మంగళవారాలలో తన తండ్రి అనాదిగా ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం తల్లిగారైన విజయమ్మ ఎమ్మెల్యేగా ఉన్న పులి వెందుల నియోజకవర్గం నుంచి రెండురోజుల పాటు ఓదార్పు యాత్ర జరపబోతున్నారు.

జగన్‌ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా చర్యలు తప్పవంటూ ప్రణబ్‌ తొలిసారిగా ఘాటైన హెచ్చరిక చేసినా పట్టించుకోకుండా తన ప్రయ త్నాలు తాను చేసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకత్వం తనపై చర్య తీసుకున్నా, లేకపోయినా కొత్త పార్టీ స్థాపించి ఎఐసిసికి తన దెబ్బ ఏమిటో రుచి చూపించాలన్న ధోరణి జగన్‌లో కనిపిస్తున్నదని పార్టీ వర్గాలు చెబు తున్నాయి. అయితే అధిష్ఠానం మాత్రం నోటి మాటలుగా తప్ప జగన్‌ విషయంలో చేతల్లో ఏ తీవ్రమైన చర్యా తీసుకోవటం లేదు. జగన్‌ ము న్ముందు ఏమి చేయబోతున్నారో తేలిన తర్వాతనే ఏదైనా నిర్ణయించాలని హై కమాండ్‌ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

పార్టీ ఏర్పాటు జరిగితే...
ఒకవేళ జగన్‌ ఊహాగానాలను నిజం చేస్తూ స్వంతంగా పార్టీ పెట్టాలనుకుంటేదాని నామకరణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను రెండుసార్లు ఒంటి చేత్తో అధికారంలోకితీసుకు వచ్చిన తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలా? లేక అనాదిగా తమ కుటుంబం నమ్ముకుని ఉన్న కాంగ్రెస్‌కు మకుటం లేని మహారాణిలా వెలిగిన ఇందిరాగాంధీ పేరు పెట్టాలా అనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఇందిరాకాంగ్రెస్‌ అనే పేరు ఖాయం చేయటానికి కొన్ని ఇబ్బందులున్నాయని ఆంతరంగికులు చెబుతున్నట్టు తెలిసింది.

jagan-speach
ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా ప్రతి బహిరంగ సభలో ఇందిర పేరును ప్రస్తావించకుండా ఉపన్యాసాన్ని కొనసాగించని నేపథ్యంలో ఇందిర పేరును తాము వాడుకుంటే రాజకీయంగా పెద్ద ప్రయోజనం ఉండదన్న ఆలోచనను కొందరు అనుయాయులు జగన్‌ వద్ద బయట పెట్టినట్టు చెబుతున్నారు. ఎలాగూ వైఎస్‌ పేరిటనే ఓదార్పు యాత్ర చేస్తున్నారు కాబట్టి పార్టీ పేరును సైతం ఆయన పేరుతోనే కొనసాగిస్తే రాజకీయంగా మనుగడ ఉంటుందన్న ఆలోచన అనుయాయుల నుంచి వస్తున్నట్టు తెలిసింది. పైగా ఈ తరం వోటర్లకు సోనియాగాంధీ తప్ప ఇందిర అంతగా తెలియకపోవ చ్చునని, అలాంటప్పుడు ఆమె పేరు పెడితే మరోరకమైన ఇబ్బంది ఎదురు కావచ్చునని కొందరు జగన్‌తో మాట్లాడినప్పుడు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు.

సెప్టెంబర్‌లో సంక్షోభమేనా?
జగన్‌ తీసుకునే ఏ నిర్ణయం అయినా కాంగ్రెస్‌లో సంక్షోభం సృష్టించక తప్పదన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జగన్‌ పార్టీ నుంచి బయటకు వెళ్తే ఆయన వెంట ఏమేర ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్తారన్న దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకవేళ జగన్‌ గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలను చీల్చుకుపోతే రోశయ్య సర్కారు భవితవ్యం ఎలా ఉంటుందన్న చర్చ సైతం పార్టీ వర్గాలో జోరుగానే సాగుతున్నది. అంటే తన తండ్రి ప్రథమ వర్ధంతి వచ్చేనెల రెండున జరగనున్న నేపథ్యంలో ఆ రోజు కానీ, ఆ తర్వాత కానీ జగన్‌ తీసుకునే ఏ నిర్ణయం అయినా పార్టీలో సంక్షోభానికి తెర తీయక తప్పదన్న ఊహాగానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

వచ్చేనెలలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జరపబోయే ఓదార్పు యాత్రకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటిరాజమోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు చంద్రశేఖరరెడ్డి, మరి కొందరు నేతలు బహిరంగంగా మద్దతు పలికారు. ఓదార్పు యాత్ర ఏర్పాట్లన్నీ బాలినేని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. యాత్ర జరపటం ఖాయం అని, ఇష్టం ఉన్న వారు రావచ్చునని, లేనివారు రాకపోయినా బలవంతం ఏమీ లేదని బాలినేని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో తనను కలిసిన నేతలకు జగన్‌ సైతం ఇదే మాట చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ లెక్కన పార్టీలో పెను సంక్షోభం సృష్టించి తన సత్తా ఏమిటో కాంగ్రెస్‌ నాయకత్వానికి చూపించాలని జగన్‌ వ్యూహ రచన చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సోమ, మంగళ వారాలలో స్వంత జిల్లాలో జరిపే ఓదార్పు యాత్ర సందర్భంగా తనకు అనుకూలురైన ఎమ్మెల్యేలతో భవిష్యత్‌ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

బల సమీకరణ మొదలు...
ఢిల్లీ వెళ్ళి అధిష్ఠానం మనుషులతో మాట్లాడిన తర్వాత ఇక తనను పార్టీ పట్టించుకునే స్థితిలో లేదని నిర్ణయానికి వచ్చినజగన్‌, శనివారం తన మద్దతుదారులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు ముసిరేలా దగ్గుబాటి దంపతులు చేశారని ఆగ్రహంగా ఉన్న జగన్‌, తన మనుషులతో వారిపై కారాలు, మిరియాలు నూరిస్తున్నారు. వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి లాంటి వారి ద్వారా కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరిని, మరో మంత్రి పనబాక లక్ష్మిని తీవ్రంగా విమర్శించేలా చేస్తున్నారు.

అలా చేస్తూనే మరోవైపు ప్రముఖులు అనుకున్న వారితో స్వయంగా మాట్లాడి అనుకూలంగా మలచుకుంటున్నారు. అలా రోజు రోజుకూ తనకు మద్దతు దారులు పెరిగేలా చూసుకుంటున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ రంగ ప్రవేశం చేశారు. ఓదార్పు యాత్ర విషయంలో కానీ, మరో అంశంపై కానీ ఎక్కువగా వ్యాఖ్యలు చేయని లగడపాటి, హఠాత్తుగా తెరపైకి వచ్చి జిల్లాకు ఒక వైఎస్‌ఆర్‌ విగ్రహం ఉంటే సరిపోతుందని అధిష్ఠానం చెప్పినట్టు వచ్చిన వార్తలపై మండి పడ్డారు. అది సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి యాత్రకు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో లగడపాటి అదనంగా జగన్‌కు అండగా మిగిలారు.

హడావుడి లేకుండానే...
తన పట్ల అధిష్ఠానం అనుసరిస్తున్న వైఖరికి రగిలిపోతున్న జగన్‌ ఎలాంటి హడావుడీ లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ఏమి చేస్తున్నదీ పది మందికి తెలియకుండా అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తున్నా రు. ప్రతి జిల్లాలో తన వారెవరో, పరాయివారెవరో అంచనాలు వేసుకుంటున్నారు. తన సర్వేలు తనకు ఉన్నాయని ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలతో కొద్ది రోజుల క్రితమే చెప్పిన ఆయన వాటి ప్రకారమే తన బలం ఎంతో, స్థాయి ఏమిటో అంచనాలు వేసుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో సెప్టెంబర్‌ మాసం కాంగ్రెస్‌ పార్టీ పాలిట సంక్షోభ మాసం అవుతుందా? సామరస్యంగా ముగుస్తుం దా అనేది చూడాల్సి ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కొందరు అభిప్రాయపడ్డారు.

అధిష్ఠానం చెప్పిందే చెప్పా - పురంధేశ్వరి
D.Purandhareswar
ఓదార్పు యాత్రపై వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పలేదు, రాష్ట్ర నేతలందరి సమక్షంలో అహ్మద్‌ పటేల్‌ ఏం మాట్లాడారో అదే మీడియాకు చెప్పా.

రోశయ్య సర్కారుపై కుట్ర - జి. వెంకటస్వామి
venkataswami
రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక వర్గం కుట్ర పన్నుతున్నది. సీడబ్యూసీలో సభ్యుడినైనందున కుట్ర దారుల పేర్లు వెల్లడించలేను

రాకపోతే ప్రతిఘటన తప్పదు - మేకపాటి
mekapatichandra
ఓదార్పునకు రాకపోతే జనం నుంచి తీవ్ర ప్రతిఘట నలను నేతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్రానికి జగన్‌లాంటి నేత కావాలి.

విషం చిమ్ముతున్న నేతలు - కొండా సురేఖ
sureka
జగన్‌పై కాంగ్రెస్‌ పార్టీలోనే కుట్ర జరుగుతున్నది. ఓదార్పుయాత్రపై మాట్లాడే అర్హత దగ్గుబాటి దంపతులకు ఏమాత్రం లేదు.

No comments:

Post a Comment